ODI WC 2023: వన్డే వరల్డ్కప్ వేదికలకు కొత్త హంగులు.. హైదరాబాద్ స్టేడియానికి రూ. 117 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంవత్సరం అక్టోబర్-నవంబర్ నెలలో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 12 ఏళ్ల తర్వాత టీమిండియాలో జరుగుతనన్ వన్డే వరల్డ్ కప్ కావడంతో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహించేందుకు 12 స్టేడియాలను షార్ట్ లిస్ట్ కూడా చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, కోల్ కతా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, ముంబై ఈ లిస్టులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని అభిమానులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also : CM YS Jagan: మహిళా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త..
Also Read
- Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
- KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
- Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
అక్టోబర్-నవంబర్ నెలల్లో జరుగబోయే ఈ మెగా టోర్నీకి ముందే దేశంలోని స్టేడియాలను పూర్తిగా న్యూ లుక్ లో కనిపించేలా కసరత్తులు చేస్తోంది. దీని కోసం రూ. 500 కోట్ల ఖర్చుతో ఐదు స్టేడియాలను రెనోవేట్ చేయనుంది. ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరున్నది. దేశంలోని క్రికెట్ స్టేడియాలు మాత్రం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వరల్డ్ కప్ కూడా ఇలాంటి స్టేడియాలలో జరిగితే పోయేది బోర్డు పరువే అందుకే.. భారీగా ఖర్చు చేసైనా సరే అర్జెంట్ గా స్టేడియాల రూపురేఖలు మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది.
Read Also : Bhatti Vikramarka : విశాఖ వద్దు బయ్యారం ముద్దు..
అయితే ఐదు స్టేడియాల రూపురేఖలు మార్చాలని అనుకున్న స్టేడియాల్లో ఢిల్లీతో పాటు హైదరాబాద్, కోల్ కతా, మొహాలి, ముంబై స్టేడియాల్లో వసతులను మెరుగుపర్చానున్నారు. వన్డే వరల్డ్ కప్ వేదికల్లో ఈసారి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి బీసీసీఐ చోటు కల్పించింది. అయితే స్టేడియంలో వసతులు, సౌకర్యాలు మరి నాసిరకంగా ఉన్నాయని అభిమానుల నుంచి ఫిర్యాదులు అందాయి. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతన్న నేపథ్యంలో అభిమానుల నుంచి ఈ ఫిర్యాదులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు తీసుకురావడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించింది. స్టేడియంలో వసతులు మెరుగుపర్చడానికి రూ. 117.17 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది.
Read Also : Karnataka Elections: బీజేపీకి ఈశ్వరప్ప షాక్.. పోటీ చేయనని నడ్డాకు లేఖ
ఇక హైదరాబాద్ తో పాటు ఢిల్లీ స్టేడియానికి రూ. 100 కోట్లు, కోత్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ కోసం రూ. 127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ. 79.46 కోట్లు, వాంఖడే కోసం రూ. 78.82 కోట్లు ఖర్చు కానుంది. ఒక వేళ ఈ స్టేడియాల్లో రూప్ పనులు కూడా చేస్తే ఈ ఖర్చ మరింత పెరుగనుంది. 2011 వరల్డ్ కప్ ఫైనల్ కు వేదికైన ముంబైలోని వాంఖెడ్ స్టేడియంలో కనీస వసతులు లేవని ఓ అభిమాని ఫిర్యాదు చేయడంతో ఈ మధ్యే ఇండియా-ఆస్ట్రేలియా వన్డేకు ముందు ఆ స్టేడియాన్ని రెనోవేట్ చేశారు. వరల్డ్ కప్ లో భాగంగా మొత్తం 48 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం ఆతిథ్యమిచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వెల్లడించింది. ఇక 2011లో భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ధోని సేన గెలిచింది. ఫైనల్ లో శ్రీలంకను ఓడించి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించి రెండోసారి వన్డే ప్రపంచకప్ ను కొట్టింది.
తాజావార్తలు
-
Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
-
RaviMohan : జయంరవి చెప్పిన మూడక్షరాల ఇడ్లి నటి ఆమేనా?
-
CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
-
International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
-
Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..