పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో, పవన్ కళ్యాణ్ టికెట్ రేట్ల పెంపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “సినిమాని తెలుగు ప్రేక్షకుల నుంచి గానీ, భారతదేశం నుంచి గానీ దూరం చేయలేము. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ నేషన్. అది మన సంస్కృతులకు మూలం. అందుకని ఈ సినిమాని మన జీవితాల్లో నుంచి తీసేయలేము. అలాగే, నాకు ఎప్పుడూ ఏ హీరో విజయం మీద ఇన్సెక్యూరిటీ ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటాను. ‘సర్వేజనో సుఖినోభవంతు’ అంటే నేను ఒక్కడినే బాగుండాలి, మిగతావాళ్ళు పోవాలి అని కాదు.. అందరూ బాగుండాలని కోరుకుంటాను. అలాగే నేను చాలా పర్యాయాలు చెప్తా ఉంటాను.
Also Read:Bollywood : సినిమా వసూళ్లు దేశ జనాభా కంటే ఎక్కువ ఉంటున్నాయి.. ప్రియదర్శన్ వైరల్ కామెంట్స్!
ఇప్పుడు ఉదాహరణకి, నేను ఈ రోజు మన ఏపీ గవర్నమెంట్కి సంబంధించి టికెట్స్ ఇవన్నీ అడుగుతా ఉంటే, నేను అది ఒకటే అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, టికెట్ హైక్స్ ఇవన్నీ ఏంటి? ఇట్ ఈజ్ అబౌట్ ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు కదా! సినిమా ఈజ్ నాట్ ఏ కంపల్సరీ. ఏమన్నా గన్ పాయింట్లో పెట్టి మీరు చూడాలి అనుకోము కదా. మనకు ఛాయిస్ ఉంది, ఈ రోజున అమెజాన్ కావచ్చు, మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ డే వెళ్లి చూడాలనుకోవడంలో, వీళ్లు ఇంత ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి అడుగుతుంటారు. నా సినిమాలకి నేను ఇంకా తక్కువ రేట్లు ఇచ్చుకున్నాను, కానీ మిగతా హీరోల సినిమాలకి నేను ఎక్కువ రేట్లు ఇప్పించాను. టికెట్ రేట్లు పెంచమని నా దగ్గరికి వస్తారు. అసలు నాకు సంబంధం లేదు. నేను ఏదైనా ఉంటే ఒకటే అడుగుతాను.. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సినిమాలు వచ్చి మిగతా హీరోలు, నిర్మాతలు వచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతాను: ‘మీరు ఎవ్వరినీ దేహి అనకండి’.
Also Read:Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నారు: పవన్
దయచేసి మీరు దేహి అనద్దు. మీరు ఎంత కష్టపడి తీస్తారో నాకు తెలుసు. పైగా మీరు పెంచిన ప్రతి రూపాయిలో 18% జీఎస్టీకి వెళ్తది. వదిలేస్తే ఎవరో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని మళ్ళీ అది క్యాష్గా వెళ్ళిపోద్ది. అది గవర్నమెంట్కి రెవెన్యూ కాదు, ఎవరికీ కాదు. దీన్ని బేస్ చేసుకొని.. నేను ఆంధ్రప్రదేశ్కి, ప్రత్యేకించి అది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి నేను మనస్ఫూర్తిగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరో.. అది ‘పుష్ప’ కావచ్చు, లేదంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, మహేష్ గారిది కావచ్చు (మహేష్ గారి సినిమా రిలీజ్ అయిందో లేదో తెలియదు కానీ నాకు ఈ మధ్య కాలంలో), ఏ సినిమా వచ్చినా గానీ, ఇంక్లూడింగ్ ‘కల్కి’ ప్రభాస్ గారు కావచ్చు, ఇంక్లూడింగ్ మన ‘కాంతార’ కూడా. కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కూడా పడకూడదు అని అన్నా గానీ, నేను ‘కాంతార’కి ఆ వివక్ష చూపించలేదు. అసలు మనది భారతదేశపు సినిమా, ఇది ఎక్కడైనా ఆడాలి. ఇది మన ఒక్కరిది కాదు, మనందరం బాగుండాలని నేను కోరుకుంటాను” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.