India: శరణార్థి పాలసీని దుర్వినియోగం చేస్తున్న ఖలిస్తానీవాదులు.. యూకేకు తేల్చి చెప్పిన ఇండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pro-Khalistan Elements Misusing Asylum Policy, India Tells UK: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం ఇంకా వేట కొనసాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. ఈ విషయం తెలిసిన విదేశాల్లోని ఖలిస్తానీవాడులు భారత రాయబార కార్యాలయాలే టార్గెట్ గా దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఖలిస్తానీవాదులు భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ.. ఇండియన్ ఎంబసీ, కాన్సులేట్స్ పై దాడులు చేయడాన్ని భారత్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ముఖ్యంగా యూకే రాజాధాని లండన్ లో ఏకంగా భారతీయ జెండాను కిందికి దించి భారత హైకమిషన్ ముందు ఖలిస్తానీ జెండాను ఎగరేసేందుకు ప్రయత్నించడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Read Also: Pocharam Srinivas Reddy : ప్రపంచంలో పేరుగాంచిన వ్యక్తి కేటీఆర్
Also Read
ఇదిలా ఉంటే యూకే శరణార్థి పాలసీని ఖలిస్తానీ మద్దతుదారులు దుర్వినియోగం చేస్తున్నారని ఆ దేశానికి భారత్ తేల్చి చెప్పింది. యూకే ఆశ్రయ ఇస్తున్న విధానం భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి వీలు కల్పిస్తోందని భారత హోం మంత్రిత్వ శాఖ, యూకే హోం మంత్రిత్వశాఖ మధ్య జరిగిన చర్చల సందర్భంగా చెప్పింది. యూకే ఆధారిత ఖలిస్తానీ మద్దతుదారులపై కఠిన పర్యవేక్షణ, క్రియాశీల చర్యలను తీసుకోవాలని భారత్ కోరింది.
లండన్ లోని భారత రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేయడంలో పాల్గొన్న చాలా మంది అక్కడ రాజకీయ ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయాన్ని యూకే తెలియజేసినట్లు భారత అధికారులు తెలిపారు. ఖలిస్తాన్ అంశంతో పాటు ఉగ్రవాద వ్యతిరేక, సైబర్ సెక్యూరిటీ, మాదకద్రవ్యాల నివారణ, నేరస్తుల అప్పగింతపై సహకారాన్ని ఇరు పక్షాలు సమీక్షించాయి. చర్చల్లో భారత ప్రతినిధి బృందం తరపున హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పాల్గొన్నారు. బ్రిటన్ నుంచి హోం ఆఫీస్ శాశ్వత కార్యదర్శి సర్ మాథ్యూ రైక్రాఫ్ట్ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?