Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం: సీఎం చంద్రబాబు
- అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
- పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం
- విగ్రహాన్ని 'స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్'గా నామకరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్’గా నామకరణం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం సహకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ప్రశంసించారు. బీజేపీ నాయకుడు మాధవ్ రాష్ట్రం మొత్తం తిరుగుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ విగ్రహాలను ఏర్పాటు చేయడంలో సహకారం అందిస్తున్నారని సీఎం చెప్పారు.
పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా ఈ 58 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘కేవలం 58 రోజుల్లోనే ఈ విగ్రహ నిర్మాణం పూర్తయింది. విగ్రహం పైభాగానికి ఎక్కి చూస్తే అమరావతి రాజధాని మొత్తం కనిపిస్తుంది. అమరావతి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. కొందరు అమరావతి గురించి తప్పుడు ప్రచారం చేస్తూ.. ఈ రాజధానిని స్మశానం, ఎడారి అంటూ విమర్శలు చేశారు. కానీ రైతులు తమ భూములను ఇచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి నిర్మాణానికి భాగస్వాములు అయ్యారు’ అని గుర్తు చేశారు.
Also Read
- Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
- UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
- PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
- Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
Also Read: Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు మన గుండెల్లో ఉన్నారు: పవన్
‘పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన త్యాగం మొత్తం తెలుగు ప్రజలకే ప్రేరణగా నిలిచింది. ఆయన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఈ విగ్రహ నిర్మాణంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పడిన కూటమి ప్రజలకు మంచి ఫలితాలు అందిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం అవసరం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆనందం, ఆరోగ్యం, ఆదాయం కలిగి ఉండేలా పని చేయడమే నిజమైన నివాళి’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
తాజావార్తలు
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!