Covid-19: దేశంలో కోవిడ్ టెర్రర్.. 8 వేల చేరువలో కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి వరకు ఆరు వేలలోపు నమోదు అయిన కేసులు తాజాగా 8 వేల చేరువ అయ్యాయి. భారత్లో గత 24 గంటల్లో 7,830 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. క్రియాశీల కేసుల 40,000 మార్కును దాటింది. ప్రస్తుతం దేశంలో 40,215 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ సానుకూలత రేటు 3.65% వద్ద నమోదు అయింది. క్రియాశీల కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.09 శాతంగా ఉన్నాయి మరియు జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,42,04,771కి పెరిగింది. అదే సమయంలో కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
Also Read:Myanmar: మయన్మార్ లో వైమానిక దాడి.. చిన్నారులు సహా 100 మంది మృతి
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించబడ్డాయి. మంగళవారం దేశంలో గత 24 గంటల్లో 5,676 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 980 కరోనా కేసులు వెలుగు చూశాయి. కోవిడ్ నియంత్రణ కోసం కేంద్రం మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది.
Also Read:Karnataka: మాజీ సీఎంకు దక్కని టికెట్.. బీజేపీకి జగదీష్ షెట్టర్ సవాల్
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
మరోవైపు కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పలు రాష్ట్రాలు కూడా అప్రమత్తమైయ్యాయి. ముందస్తు చర్యలు చేపట్టాయి. కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు ప్రజలను సూచిస్తున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, మాస్క్లు ధరించడం, హ్యాండ్ శానిటైజర్లను తరచుగా ఉపయోగించడం, భౌతిక దూర నిబంధనలను కొనసాగించడం వంటి చర్యలకు ఆదేశించాయి.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!