వెస్టిండీస్తో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందులో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. గత ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన తిలక్.. ఎట్టకేలకు టీ20ల్లో స్థానం దక్కించుకున్నాడు. అందరూ అనుకున్నట్టుగానే జాతీయ స్థాయిలో ఆడుతాడని పలువురు క్రికెటర్లు చెప్పారు.
వెస్టిండీస్తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ చెమటలు వచ్చేలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బార్బడోస్లో నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న విరాట్ కోహ్లీ.. అద్భుతమైన షాట్లు ఆడాడు. ఇండియా -పాకిస్తాన్ అభిమానులు ఒకరినొకరు తిట్టుకునేలా విరాట్ ఏ షాట్ ఆడాడని మీరు అనుకుంటున్నారా..! అసలు విషయానికి వస్తే.. బార్బడోస్ లో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్.. అశ్విన్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడాడు.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదలైంది. అందులో కింగ్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపిస్తుంది. తన తోటి ఆటగాళ్లతో కలిసి నెట్ లో బిజీగా గడిపేస్తున్నాడు.
దాదాపు ఆరు సంవత్సరాల క్రితం, ఆగస్టు 2017లో దిగ్గజ బ్రిటీష్ మోటార్సైకిల్ తయారీదారు ట్రయంఫ్, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం చిన్న నుంచి మధ్య స్థాయి సామర్థ్యం గల మోటార్సైకిళ్లను రూపొందించడానికి భారతీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్తో జతకట్టింది.
ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో పాల్గొనే భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్న ఆంధ్ర పేసర్, సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
ఇండియాకు మరో టెక్ కంపెనీ రాబోతోంది. చైనాలో ఉన్న తైవాన్కు చెందిన సెమీకండక్టర్కు చెందిన టెక్ కంపెనీని ఇండియాకు తరలించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. చైనా, తైవాన్ల మధ్య సత్సంబంధాలు అంతంత మాత్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే చైనాలో కొనసాగుతున్న కంపెనీలను తైవాన్ ఇతర దేశాలకు తరలించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోనే కాదు.. బయట కూడా చాలా కూల్గా ఉంటాడు. ఏమాత్రం గర్వం లేనివాడు ధోనీ. అంతేకాదు అందరితో చాలా సరదాగా గడుపుతాడు. అన్నింటిని ఇంచి మంచి మనసున్న మనిషి. ఇప్పటికే ఎన్నోసార్లు తన మంచి మనసు చాటుకున్న ధోనీ.. తాజాగా మరోసారి చాటుకున్నాడు. తన విల్లాలో పని చేసే సెక్యూరిటీ గార్డుకు మహీ సాయం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో…
భారతదేశం ఆహారం, ప్రత్యేక రుచి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అనేక రకాల వంటకాలు ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రసిద్ధ వంటకాల్లో బిర్యానీ ఒకటి. ఇది అందరికీ నచ్చే వంటకం. బిర్యానీ అనేది ఒక వంటకం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలతో పంచుకునే భావోద్వేగం.
2023 ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అక్టోబర్-నవంబర్లో 10 వేదికల్లో ప్రపంచకప్ మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్లో భారత్-పాకిస్థాన్ల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు పాకిస్థాన్ భారత్కు వచ్చే దానిపై క్లారిటీ లేదు. అంతేకాకుండా బోర్డు పాకిస్థాన్ ప్రభుత్వానికి 3 ప్రశ్నలు వేసింది. అయితే ఆ సమాధానాలు వచ్చిన తర్వాతే పాకిస్తాన్ భారతదేశానికి వచ్చేట్లుగా తెలుస్తుంది.
ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో రక్షణ శాఖ ఒప్పందానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. భారత్తో కలిసి మల్టీ రోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ను అభివృద్ధి చేయడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఇంజిన్ల తయారీ పూర్తిగా ఇండియాలోనే చేపట్టనున్నారు. ఇటీవల అమెరికాతో కుదిరిన GE-414 ఇంజిన్ డీల్ తరహాలోనే తాజాగా ఫ్రాన్స్ భారత్కు ఆఫర్ ఇచ్చింది.