India: భారత్లో మధ్య తరగతి పెరుగుతోంది.. 2031 నాటికి సగానికి తగ్గనున్న నిరుపేదలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచం అంతా ఆర్థికమాంద్యంతో బాధపడుతుంటే.. భారత్ మాత్రం ఈ ఏడాది జీడీపీలో టాప్ 1 స్థానంలో నిలుస్తుందని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో భారతదేశంలో మధ్యతరగతి వర్గం వేగంగా విస్తరిస్తోందని.. అలాగే 2031 నాటికి పేదల సంఖ్య దాదాపుగా సగానికి తగ్గుతుందని పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ అండ్ ఇండియాస్ సిటిజన్ ఎన్విరాన్మెంట్ బుధవారం విడుదల చేసిన నివేదికలో తేలింది.
ఈ దశాబ్ధం చివరినాటికి భారత దేశంలో ‘సూపర్ రిచ్’ కుటుంబాలు ఐదు రెట్లు పెరుగుతాయని అంచనా వేసింది. పేదలు అత్యధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువ వృద్ధి కనిపిస్తుందని తెలిపింది. 2021 నాటికి 20 మిలియన్ రూపాయలను($243,230) కన్నా ఎక్కువ సంపాదిస్తున్న సూపర్ రిచ్ కుటుంబాల సంఖ్య ఐదేళ్లలో 1.8 మిలియన్లకు దాదాపుగా రెండింతలు అవుతుందని నివేదిక తెలిపింది. గ్రామాల్లో ఇటువంటి కుటుంబాల వృద్ధి 14.2 శాతం, నగరాల్లో 10.6 శాతం ఉంటుందని పేర్కొంది.
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
Read Also: Pakistan Rains: పాక్ కు దెబ్బ మీద దెబ్బ.. భారీ వర్షం.. 30ఏళ్ల రికార్డు బద్దలు
2031 నాటికి సూపర్ రిచ్ కుటుంబాలు 9.1 మిలియన్లకు పెరుగుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన వృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది. 25 రాష్ట్రాల్లో 40,000 కంటే ఎక్కువ మందిని సర్వే చేసిన తర్వాత ఈ అధ్యయనం ఈ గణాంకాలను పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాణిజ్య వ్యవసాయ వ్యపారాలతో పాటు వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఎక్కువగా నిమగ్నమయ్యారని.. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నివేదిక రచయిత రాజేశ్ శుక్లా చెప్పారు. ఎంటర్ప్రెన్యూయర్లు గ్రామీణ ప్రాంతాలకు వరదల వస్తున్నారి.. ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉద్యోగాలు, చిన్నవ్యాపారాలను సృష్టిస్తున్నారని అన్నారు. గ్లోబల్ మేనేజర్లు, విదేశీ బ్యాంకులు భారతదేశంలో పెరుగుతున్న మిలియనీర్లకు నిలయంగా మారతున్నాయని చెప్పారు.
20185-2022 మధ్య భారతదేశంలో ప్రతీరోజూ 70 మంది కొత్త మిలియనీర్లను తయారుచేసిందని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అంచనా వేసింది. మిడిల్ క్లాస్ లగ్జరీ కార్లను కొనుగోలు చేయడంతో పాటు విదేశీ సెలవుల కోసం ఖర్చు చేస్తున్నారని, ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ గౌతమ్ అదానీ వంటి బిలియనీర్ల వంటి వారి వేగవంతమైన పెరుగుదలను చూస్తోందని నివేదిక వెల్లడించింది. దేశంలో ఏడాదికి 6000-36,000 వరకు సంపాదిస్తున్న 43.2 కోట్ల మధ్యతరగతి వర్గం విస్తరిస్తుందని, ఇది 2031 నాటికి 71.5 మిలియన్లకు చేరుతుందని అంచానా వేసింది. అలాగే నిరుపేదలు ఆ సమాయానికి 7.9 కోట్లలో సగాని కన్నా ఎక్కువగా తగ్గుతారని నివేదిక వెల్లడించింది.
తాజావార్తలు
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!