Nepal: భారత వ్యాపారవేత్తపై ప్రధాని పుష్పకమల్ దహల్ కామెంట్స్.. రాజీనామా చేయాలని డిమాండ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్(ప్రచండ) చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే నేపాల్ రాజకీయాలు అస్థిరంగా ఉన్నాయి. తాజాగా పీఎం దహల్ చేసిన వ్యాఖ్యలు అక్కడ అగ్గిని రాజేశాయి. నేపాల్ లో స్థిరపడిన ఓ భారతీయ వ్యాపారవేత్తను ఉద్దేశించి.. గతంలో ఆయన తనను ప్రధాని చేయడానికి కృషి చేశాడని ప్రధాని వ్యాఖ్యానించడం వివాదాన్ని రేకెత్తించింది. దీంతో ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
నేపాల్లోని అగ్రగామి ట్రక్కింగ్ వ్యవస్థాపకుడు సర్దార్ ప్రీతమ్ సింగ్ నేపాల్-భారత్ సంబంధాలను మెరుగుపరచడంలో ప్రత్యేక మరియు చారిత్రాత్మక పాత్ర పోషించారని ప్రచండ అన్నారు. ‘రోడ్స్ టు ది వ్యాలీ: ది లెగసీ ఆఫ్ సర్దార్ ప్రీతమ్ సింగ్ ఇన్ నేపాల్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సోమవారంనాడు ప్రచండ ఈ వ్యాఖ్యలు చేశారు. నన్ను ప్రధాని చేయడానికి అయన అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి.. ఖాట్మాండులోని రాజకీయ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: Inaya sultana : జారిపోతున్న డ్రెస్ లో బరువైన అందాలతో హాట్ షో చేస్తున్న ఇనయా..
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-(యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) (CPN-UML) బుధవారం జరిగిన జాతీయ అసెంబ్లీ సమావేశానికి అంతీరాయం కలిగించి, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దీంతో గురువారం సభ మధ్యాహ్నాం 1 గంటలకు వాయిదా పడింది. కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మాట్లాడుతూ.. ఆయన వ్యాఖ్యలు దేశ స్వాతంత్య్ర, గౌరవం, రాజ్యాంగం, పార్లమెంట్ కు దెబ్బ అని అన్నారు. న్యూఢిల్లీ నియమించిన ప్రధాని పదవిలో కొనసాగే హక్కు లేదని ప్రధాన ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి.
ప్రచండ వ్యాఖ్యలపై విపక్షాలే కాకుండా అధికార పక్ష నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పీఎం ప్రచండ అన్నారు. నా అభిప్రాయం నేపాల్ అంతర్గత విషయాల్లో భారత్ జోక్యం చేసుకుందని చెప్పడం కాదని.. సర్దార్ ప్రతీమ్ సింగ్ కు రాజకీయాల్లో ఆసక్తి ఉందని చెప్పడమే అని అన్నారు.
తాజావార్తలు
-
US-Iran Tensions: “ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే”.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
-
AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!