Canada: “పెరట్లో పామును పెంచుతున్నాం”.. ఖలిస్తానీలపై భారత సంతతి ఎంపీ హెచ్చరిక..
Canada: ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా వేదికగా మారుతోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా దేశాన్ని వినియోగించుకుంటున్నారు ఖలిస్తానీలు. ఇప్పటికే కెనడాలోని పలు భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత్ నుంచి పంజాబ్ ను విభజించి సపరేట్ ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో భారతదేశానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కెనడానే కాకుండా యూకే, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు బలపడుతున్నారు.
Read Also: Tomatoes stolen: కర్ణాటకలో టమాటాల దొంగతనం.. కేసు నమోదు..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ఇదిలా ఉంటే ఖలిస్తానీ చర్యలపై కెనడాలోని భారతసంతతికి చెందిన ఎంపీ, లిబరల్ పార్టీ నేత చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఖలిస్తాన్ మద్దతుదారులు కొంతమంది భారత దౌత్యవేత్తల ఫోటోలతో పోస్టర్లు వేసి బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై చంద్ర ఆర్య స్పందించారు. కెనడా ‘‘ పెరట్లో పాములు పెంచుతోంది, ఆ పాములు తల ఎత్తుకుని బుసలు కొడుతున్నాయి’’ అని హెచ్చరించారు. ఇలా పోస్టర్లో దౌత్యవేత్తలను బెదిరించడాన్ని ఖండించారు. కెనడాలో ఖలిస్తానీలు హింస, ద్వేషాన్ని ప్రొత్సహించడం ద్వారా హక్కులు, స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఆ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. పెరట్లో పాములు బుసలు కొడుతున్నాయి, అవి ఎప్పుడు మనల్ని కాటేస్తాయో అనేదే ప్రశ్న అంటూ కామెంట్స్ చేశారు.
జూలై 8న జరగనున్న ‘ఖలిస్తాన్ ఫ్రీడమ్ ర్యాలీ’ని ఖలిస్తానీలు నిర్వహిస్తున్నారు. టొరంటో, అట్టావా, వాంకోవర్ నగరాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలకు పిలుపునిచ్చారు. ఓ పోస్టర్ విడుదల చేస్తూ.. ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ మరియు టొరంటోలోని కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవను ‘‘కిల్లర్స్’’గా అభివర్ణించారు. వీరిని ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కిల్లర్స్ గా పేర్కొన్నారు. గత నెల భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీని చంపేసిన విధానాన్ని ప్రతిబింబించేలా ఓ శకటాన్ని పెరేడో లో ప్రదర్శించారు. ఈ చర్యలు కెనడా, ఇండియా దేశాల మధ్య ఘర్షణలు ప్రేరేపించాయి. ఇదే జరుగుతూ ఉంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయిని విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా స్పందించారు. సోమవారం భారత్ లోని కెనడా రాయబారికి సమన్లు జారీ చేసింది.
https://twitter.com/AryaCanada/status/1676373854678306817
తాజావార్తలు
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
-
Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
-
Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
-
Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో