Canada: “పెరట్లో పామును పెంచుతున్నాం”.. ఖలిస్తానీలపై భారత సంతతి ఎంపీ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా వేదికగా మారుతోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా దేశాన్ని వినియోగించుకుంటున్నారు ఖలిస్తానీలు. ఇప్పటికే కెనడాలోని పలు భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత్ నుంచి పంజాబ్ ను విభజించి సపరేట్ ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో భారతదేశానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కెనడానే కాకుండా యూకే, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు బలపడుతున్నారు.
Read Also: Tomatoes stolen: కర్ణాటకలో టమాటాల దొంగతనం.. కేసు నమోదు..
Also Read
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
ఇదిలా ఉంటే ఖలిస్తానీ చర్యలపై కెనడాలోని భారతసంతతికి చెందిన ఎంపీ, లిబరల్ పార్టీ నేత చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఖలిస్తాన్ మద్దతుదారులు కొంతమంది భారత దౌత్యవేత్తల ఫోటోలతో పోస్టర్లు వేసి బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై చంద్ర ఆర్య స్పందించారు. కెనడా ‘‘ పెరట్లో పాములు పెంచుతోంది, ఆ పాములు తల ఎత్తుకుని బుసలు కొడుతున్నాయి’’ అని హెచ్చరించారు. ఇలా పోస్టర్లో దౌత్యవేత్తలను బెదిరించడాన్ని ఖండించారు. కెనడాలో ఖలిస్తానీలు హింస, ద్వేషాన్ని ప్రొత్సహించడం ద్వారా హక్కులు, స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఆ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. పెరట్లో పాములు బుసలు కొడుతున్నాయి, అవి ఎప్పుడు మనల్ని కాటేస్తాయో అనేదే ప్రశ్న అంటూ కామెంట్స్ చేశారు.
జూలై 8న జరగనున్న ‘ఖలిస్తాన్ ఫ్రీడమ్ ర్యాలీ’ని ఖలిస్తానీలు నిర్వహిస్తున్నారు. టొరంటో, అట్టావా, వాంకోవర్ నగరాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలకు పిలుపునిచ్చారు. ఓ పోస్టర్ విడుదల చేస్తూ.. ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ మరియు టొరంటోలోని కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవను ‘‘కిల్లర్స్’’గా అభివర్ణించారు. వీరిని ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కిల్లర్స్ గా పేర్కొన్నారు. గత నెల భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీని చంపేసిన విధానాన్ని ప్రతిబింబించేలా ఓ శకటాన్ని పెరేడో లో ప్రదర్శించారు. ఈ చర్యలు కెనడా, ఇండియా దేశాల మధ్య ఘర్షణలు ప్రేరేపించాయి. ఇదే జరుగుతూ ఉంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయిని విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా స్పందించారు. సోమవారం భారత్ లోని కెనడా రాయబారికి సమన్లు జారీ చేసింది.
https://twitter.com/AryaCanada/status/1676373854678306817
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!