India vs Pakistan Records: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్-పాకిస్తాన్ గత రికార్డ్స్ ఇవే! టీమిండియాదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
History of India vs Pakistan in ODI World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మ్యాచ్లు జరుగుతాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనున్న మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. 48 మ్యాచ్లకు భారత్లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో భారత్ తన ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభిస్తుంది. ఇక ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల సమరం అక్టోబర్ 15న జరగనుంది. భారత్, పాకిస్తాన్ జట్లు ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి.
ప్రపంచకప్ 2023 కోసం పాకిస్తాన్ జట్టు ఏడేళ్ల విరామం తర్వాత భారత్లో అడుగుపెట్టనుంది. పాక్ చివరిసారిగా 2016 టీ20 ప్రపంచకప్ కోసం భారత్ వచ్చింది. ప్రపంచకప్ 2023 కోసం ఏడేళ్ల తర్వాత భారత్కు రానుంది. ఇరు దేశాల మధ్య బేధాభిప్రాయాల కారణంగా గత కొంత కాలంగా ఇండో-పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్లు కూడా జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే తలపడుతున్నాయి. ఇక వన్డే ప్రపంచకప్లలో పాకిస్థాన్పై భారత్ ఆధిపత్యం ఎక్కువ. ఆ రికార్డ్స్ ఇప్పుడు చూద్దాం.
Also Read
- Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
వన్డే ప్రపంచకప్లో ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ జట్లు ఏడు సార్లు తలపడ్డాయి. 1992, 1996, 1999, 2003, 2011, 2015 మరియు 2019లో జరిగిన ఏడు మ్యాచులలో భారత్ గెలిచింది. 2007లో వెస్టిండీస్లో జరిగిన ప్రపంచకప్లో ఇండో-పాక్ టీమ్స్ గ్రూప్ రౌండ్ నుంచే ఇంటిదారి పట్టాయి. దాంతో తలపడే అవకాశం రాలేదు. ఇక 2023లో కూడా తన హవా కంటిన్యూ చేయాలని భారత్ చూస్తోంది.
భారత్-పాకిస్తాన్ రికార్డ్స్ (India vs Pakistan ODI World Cup Records):
# 1992లో పాకిస్తాన్తో సిడ్నీలో జరిగిన మ్యాచ్లో భారత్ 49 ఓవర్లలో 216 పరుగులు చేసింది. పాక్ 173 పరుగులకు ఆలౌటైంది.
# 1996లో బెంగుళూరులో జరిగిన మ్యాచ్లో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. నవజోత్ సిద్ధూ 115 బంతుల్లో 93 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
# 1999లో మాంచెస్టర్లో జరిగిన మ్యాచ్లో భారత్ 47 పరుగుల తేడాతో గెలిచింది. వెంకటేష్ ప్రసాద్ 5 వికెట్స్ తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
# 2003లో సెంచూరియన్లో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సచిన్ టెండూల్కర్ 75 బంతుల్లో 98 పరుగులు చేశాడు.
# 2011లో మొహాలీలో జరిగిన మ్యాచ్లో భారత్ 29 పరుగుల తేడాతో గెలిచింది. 85 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
# 2015లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో భారత్ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.
# 2019లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 89 పరుగుల తేడాతో గెలుపొందింది. రోహిత్ శర్మ 140 పరుగులు చేశాడు.
Also Read: Virat Kohli Out: ఉనాద్కత్ బౌలింగ్లో కోహ్లీ ఔట్.. వీడియో వైరల్!
Also Read: Oppo Reno 10 5G Price: లీకైన ఒప్పో రెనో 10 5జీ ధర.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
-
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!