మలేషియాలో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లకపోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆ సదస్సుకు ట్రంప్ రావడంతోనే మోడీ వెళ్లడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్లో పేర్కొన్నారు. ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ఈ సమావేశానికి వెళ్లడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య బంధం చెడింది. ట్రంప్-మోడీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా ఆ బంధం మళ్లీ చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నట్లుగా నివేదికలు అందుతున్నాయి.
దీపావళి వేడుకల్లో ప్రధాని మోడీ లక్ష్యంగా న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ విమర్శలు గుప్పించారు. క్వీన్స్లోని హిందూ దేవాయాలను సందర్శించిన తర్వాత భారతీయులను ఉద్దేశించి మమ్దానీ ప్రసంగించారు. భారతదేశంలో కొన్ని రకాల భారతీయులకు మాత్రం స్థలం ఉందని.. అదే దార్శనికతతో భారతదేశాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
వైట్హౌస్లో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. వైట్హౌస్లో ట్రంప్ దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
అల్లుడి కిడ్నాప్, హత్యకు స్కెచ్ వేసిన అత్త.. ట్విస్ట్ ఏంటంటే..? గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మణికంఠకు నాలుగేళ్ల క్రితం పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన లిఖితతో పెళ్లయింది. వీరికి ఒక కుమార్తె సంతానం.. అయితే, పెళ్లి జరిగినప్పటి నుంచి అత్త విజయలక్ష్మి ప్రవర్తన మణికంఠకు నచ్చలేదు. దీంతో, తన భార్య లిఖితను కూడా పుట్టింటికి దూరంగా ఉండాలని చెప్పారు. లిఖిత కూడా తల్లితో దూరంగా ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తన కూతుర్ని తనకు దూరం…
భారత్ను మళ్లీ ట్రంప్ హెచ్చరించారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయకపోతే భారీగా సుంకాలు కొనసాగుతాయని వార్నింగ్ ఇచ్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు క్రమక్రమంగా తగ్గి్స్తామని ప్రధాని మోడీ తనతో ఫోన్ చెప్పారని గత వారం ట్రంప్ వ్యాఖ్యానించారు.
మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.. అయితే, కాస్త తెరపి ఇచ్చిన తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.. అయితే, 4 రోజుల తర్వాత దక్షిణ…
Pakistan: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంతో ‘‘డ్యూరాండ్ లైన్’’ వద్ద తుపాకులు గర్జిస్తున్నాయి. ఇప్పటికే, రెండు వైపుల పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఇదిలా ఉంటే, కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, పాకిస్తాన ఆఫ్ఘాన్ సరిహద్దు జిల్లాలపై వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పాక్-అఫ్ఘాన్ వివాదాన్ని భారత్తో ముడిపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ లో నివసిస్తున్న అందరు…