India At UN: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అబద్ధాలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. నిన్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో షరీఫ్ మాట్లాడుతూ.. తాము ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ను ఓడించామని ప్రగల్భాలు పలికారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ శాంతి కాముకుడని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. హిందుత్వ ఉగ్రవాదం ప్రపంచానికి ప్రమాదకరమని అసత్యాలను ప్రచారం చేశాడు.
కామినేని, బాలకృష్ణ ఎపిసోడ్పై సీఎం చంద్రబాబు సీరియస్..! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేనే లేదు.. మొత్తం అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులే ఉన్నారు. అయినా, అసెంబ్లీ హాట్ టాపిక్గా సాగుతోంది.. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రతిపక్షం సభలో లేకపోయినా.. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల తీరే.. ఆ కూటమిలో చిచ్చు పెట్టేలా తయారవుతోంది.. మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వ్యవహారం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ వర్సెస్ బోండా ఉమగా మారిపోయింది..…
* ఇవాళ బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ టెక్నాలజీని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. వర్చువల్ సమావేశానికి సీఎం చంద్రబాబుకు బీజేపీ ఆహ్వానం.. టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం.. ప్రధాని మోడీ వర్చువల్ గామాట్లాడే విధంగా విజయవాడ లో ఉదయం 9.30 కు ఏర్పాటు * అమరావతి: ఇవాళ ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్ తో ప్రారంభంకానున్న చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు.. * అమరావతి :…
India Russia: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తుందనే ఆరోపణతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాన్ని విధించాడు. అయితే, దీనిపై నాటో ఛీఫ్ మార్క్ రుట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల దెబ్బ మోడీకి తగిలిందని, అందుకే మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారని, యుద్ధ వ్యూహాలను అడిగారని అన్నారు.
మోడీ-పుతిన్ సంబంధాలపై నాటో చీఫ్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో ఎలా ముందుకెళ్తున్నారన్న విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ను ప్రధాని మోడీ ఆరా తీసినట్లు నాటో చీఫ్ పేర్కొన్నారు.
* తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముడోవ రోజు.. ఉదయం 8 గంటలకు నరశింహ అవతారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రాత్రి 7 గంటలకు శ్రీకృష్ణుని అవతారంలో ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి * విజయవాడ ఇంద్రకీలాద్రి పై నేడు ఐదవ రోజు దసరా ఉత్సవాలు.. శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు * హైదరాబాద్: తెలంగాణలో 2,620 మద్యం షాపుల లైసెన్స్ల జారీకి నోటిఫికేషన్.. నేటి…
పల్నాడులో రోడ్డు ప్రమాదం.. తిరుపతికి చెందిన డాక్టర్ సహా ఇద్దరు మృతి.. ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వైద్యుడు, అతని కూతురు మృతిచెందారు.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుపతికి చెందిన వైద్యుడు కిషోర్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో గుంటూరు బయల్దేరి వెళ్తుండగా.. తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం…