LPG Gas Supply: ఎల్పీజీపై కేంద్రం చర్యలు.. ఎస్మా ప్రయోగం..?
- ఎల్పీజీపై కేంద్రం చర్యలు
- ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు
- ఎస్మా ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్లో తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. దేశంలో ఎల్పీజీ కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు జారీ చేసింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అధికారాలను వినియోగిస్తూ దేశంలోని ఆయిల్ రిఫైనరీలకు ఎల్పీజీ ఉత్పత్తిని వెంటనే పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించింది. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేసింది. గ్యాస్ సరఫరా అంతరాయం కారణంగా కొన్ని రాష్ట్రాల్లో హోటళ్లు, ఆహార వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి: War Effects: ముంబై, చెన్నైలో గ్యాస్ సంక్షోభం.. మూతపడ్డ పలు హోటల్స్
Also Read
అధికారుల వివరాల ప్రకారం.. వాణిజ్య, గృహ అవసరాల కోసం ఎల్పీజీపై డిమాండ్ భారీగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రిఫైనరీలు ఉత్పత్తిని పెంచాలని కేంద్రం స్పష్టం చేసింది. ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం అత్యవసర సేవలను నిరంతరం కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ చట్టం కింద అవసరమైన సేవలను అందించే సంస్థలు తమ కార్యకలాపాలను ఆపకుండా కొనసాగించాల్సి ఉంటుంది. గ్యాస్ సరఫరా కూడా ప్రజల దైనందిన జీవితానికి కీలకమైనదిగా భావించి ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: భారీ ఝలక్ ఇచ్చిన వెండి, బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!
ఇకపోతే ఇటీవల కొన్ని నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటల్ పరిశ్రమ తీవ్ర ప్రభావం ఎదుర్కొంటోంది. సరఫరా అంతరాయం వల్ల అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కేంద్రం ఉత్పత్తి పెంపుతో పాటు సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వినియోగదారులు, వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు త్వరలోనే తగ్గుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
Government of India invokes the Essential Commodities Act, 1955, to regulate the availability, supply and equitable distribution of petroleum and petroleum products and natural gas pic.twitter.com/OqtsDwb13s
— ANI (@ANI) March 10, 2026
తాజావార్తలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
-
Bihar Politics: ఆర్జేడీలో ఇంటిపోరు.. నాపై చర్య తీసుకోవాలని లాలూ కుమార్తె సవాల్..
-
Pregnancy: గర్భిణులకు “కాస్మెటిక్స్” ముప్పు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
-
Anu Beniwal: శెభాష్ ఐపీఎస్.. రన్నింగ్తో సత్తా చాటిన 9 నెలల నిండు చూలాలి
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!