Israel: హమాస్- లష్కరే తోయిబా మధ్య సంబంధాలు.. ఉగ్రవాద సంస్థగా భారత్ ప్రకటించాలి..
- హమాస్- లష్కరే తోయిబా మధ్య సంబంధాలు..
- హమాస్ ను ఉగ్రవాద సంస్థగా భారత్ గుర్తించాలని ఇజ్రాయెల్ వినతి..
- భారత్ తీసుకునే నిర్ణయం దక్షిణాసియా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది: ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: హమాస్ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్ ఇటీవల భారత్ను అధికారికంగా కోరింది. హమాస్- లష్కరే తోయిబా (LeT) మధ్య సంబంధాలు పెరిగిపోతున్నాయని తెలిపింది. తాము ఇప్పటికే లష్కరే తోయిబాను తీవ్రవాద సంస్థ జాబితాలో చేర్చినందున, భారత్ కూడా ఇదే విధంగా స్పందించి హమాస్ ని తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని పేర్కొనింది. న్యూఢిల్లీ తీసుకునే నిర్ణయం దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
Read Also: PM Modi: పార్లమెంట్లో నేడు ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న మోడీ
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
అయితే, హమాస్- లష్కరే తోయిబా వంటి గ్రూపుల వ్యవస్థలు, నెట్వర్క్లు, వాటి అనుసంధానాలపై భారత ప్రభుత్వం స్పష్టమైన అవగాహన కలిగి ఉందని ఇజ్రాయెల్ అధికారులు చెప్పుకొచ్చారు. ఈ సంస్థలను ఉగ్రవాద గ్రూపులుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొనింది. అలాగే, ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ (IRGC), హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాడులు చేయడానికి అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్లను ఉపయోగిస్తున్నాయని టెల్ అవివ్ ఆరోపించింది. ప్రత్యక్షంగా దాడులు చేయకుండా, డ్రగ్ మాఫియా, మానవ అక్రమ రవాణాదారులు లాంటి నేరగాళ్లను ఉపయోగించి దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
Read Also: ఓరి దేవుడా, మరీ ఇంత తక్కువా.. Google Pixel 9 Proపై దిమ్మతిరిగే ఆఫర్ భయ్యో!
ఇక, 1987లో స్థాపించిన హమాస్ను అమెరికా, యూకే, కెనడా వంటి అనేక దేశాలు ఇప్పటికే తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై జరిగిన దాడిని భారత్ ఖండించినప్పటికీ, భారతీయ చట్టాల ప్రకారం హమాస్కు ఇప్పటి వరకు ఉగ్రవాద సంస్థగా గుర్తింపు ఇవ్వలేదు. హమాస్ను తీవ్రవాద సంస్థగా న్యూఢిల్లీ ప్రకటిస్తే అది ప్రపంచవ్యాప్తంగా బలమైన సందేశాన్ని ఇస్తుందని ఇజ్రాయెల్ పేర్కొంది. ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవులు వంటి దేశాలు భారత్ నిర్ణయాలను గౌరవిస్తాయని చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఆస్తుల ఫ్రీజింగ్ లేదా ప్రవేశ నిషేధం మాత్రమే కాదని, తీవ్రవాదంపై భారత్ తన స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రపంచానికి తెలియజేసే నిర్ణయమని టెల్ అవివ్ పేర్కొంది.
తాజావార్తలు
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!