Trump: భారత్కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక.. ఈసారి దేనిపైనంటే..!
- భారత్కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక
- భారత్ బియ్యం డంప్ నిలిపివేయాలని వార్నింగ్
- లేదంటే అధిక సుంకాలు విధిస్తామన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. అయితే మిగతా దేశాలకు ఒకలాగా.. భారతదేశంపై మరొకలాగా సుంకాలు విధించారు. భారత్పై ఏకంగా 50 శాతం సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. అనంతరం రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నడిచినా ఫలించలేదు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతమాత్రంగానే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Vijay: కరూర్ తొక్కిసలాట తర్వాత నేడు పబ్లిక్లోకి వస్తున్న విజయ్.. వేదిక ఎక్కడంటే..!
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
తాజాగా ట్రంప్ మరో హెచ్చరిక చేశారు. భారత్ నుంచి అమెరికాలోకి బియ్యం డంప్ను నిలిపివేయాలని సూచించారు. లేదంటే కొత్త సుంకం విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. బియ్యం దిగుమతులపై సుదీర్ఘ చర్చ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Telangana Rising Global Summit Day1: తొలి రోజే రూ. 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులు..
భారతదేశం నుంచి అమెరికాకు ఎక్కువగా బియ్యం దిగుమతులు అవుతుంటాయి. ఇక కెనడా నుంచి ఎరువులు వస్తుంటాయి. అయితే భారత్ నుంచి బియ్యం దిగుమతులు ఎక్కువగా వస్తున్నాయని.. దీంతో అమెరికన్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెల్లడించారు. విదేశీ దిగుమతులు కారణంగా దేశీయ ఉత్పత్తిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక రిపబ్లికన్ నాయకుడు పేర్కొన్నాడు. దీంతో ట్రంప్ జోక్యం పుచ్చుకుని అమెరికన్ ఉత్పత్తిదారులను కాపాడేందుకు మరింత సుంకాలు మోపుదామని హెచ్చరించారు. ఈ సందర్భంగా భారత్, కెనడా దేశాల పేర్లను ప్రస్తావించారు.స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కెనడా నుంచి వచ్చే ఎరువులపై.. భారత్ నుంచి వచ్చే బియ్యం డంప్పై అధిక సుంకాలు విదిద్దామని ట్రంప్ హెచ్చరించారు. ఇలా చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.
గత దశాబ్దంలో భారత్-అమెరికా మధ్య వ్యవసాయ వాణిజ్యం సాగుతోంది. భారతదేశం నుంచి బాస్మతి, ఇతర బియ్యం ఉత్తత్తులు, సుగంధ ద్రవ్యాలు, సముద్ర వస్తువులు, బాదం, పత్తి, పుప్పుధాన్యాలను అమెరికా దిగుమతి చేసుంటుంది. ట్రంప్ సుంకాలు ప్రకటించేంత వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే అధిక సుంకాలు విధించారో అప్పటి నుంచే సంబంధాలు దెబ్బతిన్నాయి.
Trump signals new tariffs on Indian rice and Canadian fertiliser
Read @ANI Story |https://t.co/eXRGraQV3Y#USPresident #Trump #Tariffs #IndianRice #CanadianFertiliser pic.twitter.com/X0s0jFgoy0
— ANI Digital (@ani_digital) December 9, 2025
US President Donald Trump has warned that he may introduce new tariffs on agricultural imports, especially on rice imports from India and fertiliser from Canada, as trade talks with both countries continue without major progress. Trump made the remarks during a meeting at the… pic.twitter.com/Z8ggXT9LPn
— NDTV WORLD (@NDTVWORLD) December 9, 2025
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!