Trump: భారత్కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక.. ఈసారి దేనిపైనంటే..!
- భారత్కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక
- భారత్ బియ్యం డంప్ నిలిపివేయాలని వార్నింగ్
- లేదంటే అధిక సుంకాలు విధిస్తామన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. అయితే మిగతా దేశాలకు ఒకలాగా.. భారతదేశంపై మరొకలాగా సుంకాలు విధించారు. భారత్పై ఏకంగా 50 శాతం సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. అనంతరం రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నడిచినా ఫలించలేదు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతమాత్రంగానే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Vijay: కరూర్ తొక్కిసలాట తర్వాత నేడు పబ్లిక్లోకి వస్తున్న విజయ్.. వేదిక ఎక్కడంటే..!
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
తాజాగా ట్రంప్ మరో హెచ్చరిక చేశారు. భారత్ నుంచి అమెరికాలోకి బియ్యం డంప్ను నిలిపివేయాలని సూచించారు. లేదంటే కొత్త సుంకం విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. బియ్యం దిగుమతులపై సుదీర్ఘ చర్చ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Telangana Rising Global Summit Day1: తొలి రోజే రూ. 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులు..
భారతదేశం నుంచి అమెరికాకు ఎక్కువగా బియ్యం దిగుమతులు అవుతుంటాయి. ఇక కెనడా నుంచి ఎరువులు వస్తుంటాయి. అయితే భారత్ నుంచి బియ్యం దిగుమతులు ఎక్కువగా వస్తున్నాయని.. దీంతో అమెరికన్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెల్లడించారు. విదేశీ దిగుమతులు కారణంగా దేశీయ ఉత్పత్తిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక రిపబ్లికన్ నాయకుడు పేర్కొన్నాడు. దీంతో ట్రంప్ జోక్యం పుచ్చుకుని అమెరికన్ ఉత్పత్తిదారులను కాపాడేందుకు మరింత సుంకాలు మోపుదామని హెచ్చరించారు. ఈ సందర్భంగా భారత్, కెనడా దేశాల పేర్లను ప్రస్తావించారు.స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కెనడా నుంచి వచ్చే ఎరువులపై.. భారత్ నుంచి వచ్చే బియ్యం డంప్పై అధిక సుంకాలు విదిద్దామని ట్రంప్ హెచ్చరించారు. ఇలా చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.
గత దశాబ్దంలో భారత్-అమెరికా మధ్య వ్యవసాయ వాణిజ్యం సాగుతోంది. భారతదేశం నుంచి బాస్మతి, ఇతర బియ్యం ఉత్తత్తులు, సుగంధ ద్రవ్యాలు, సముద్ర వస్తువులు, బాదం, పత్తి, పుప్పుధాన్యాలను అమెరికా దిగుమతి చేసుంటుంది. ట్రంప్ సుంకాలు ప్రకటించేంత వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే అధిక సుంకాలు విధించారో అప్పటి నుంచే సంబంధాలు దెబ్బతిన్నాయి.
Trump signals new tariffs on Indian rice and Canadian fertiliser
Read @ANI Story |https://t.co/eXRGraQV3Y#USPresident #Trump #Tariffs #IndianRice #CanadianFertiliser pic.twitter.com/X0s0jFgoy0
— ANI Digital (@ani_digital) December 9, 2025
US President Donald Trump has warned that he may introduce new tariffs on agricultural imports, especially on rice imports from India and fertiliser from Canada, as trade talks with both countries continue without major progress. Trump made the remarks during a meeting at the… pic.twitter.com/Z8ggXT9LPn
— NDTV WORLD (@NDTVWORLD) December 9, 2025
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!