సొంతగడ్డపై భారత్ ఘోర పరాజయంను చవిచూసింది. దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (54) టాప్ స్కోరర్. టాప్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి, మార్కో యాన్సన్ చెరో వికెట్ తీశారు. ఈ ఓటమితో టీమిండియా టెస్ట్…
దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రాహుల్ టీమిండియాను నడిపించనున్నాడు. మెడ నొప్పితో బాధపడుతున్న రెగ్యులర్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ స్థానంలో రాహుల్ను బీసీసీఐ నియమించింది. రాహుల్ గతంలో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. మూడు ఫార్మాట్లలో సారథిగా చేశాడు. మరోసారి కెప్టెన్సీని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కేఎల్ రాహుల్కు పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు కానీ..…
గత నవంబరులో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ భంగపడిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్లో వైట్వాష్కు గురై.. తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. స్పిన్ ఆడడంలో మేటి జట్టుగా పేరున్న టీమిండియా.. సొంతగడ్డపై అదే స్పిన్ ఉచ్చులో పడడం భారత క్రికెట్ను కుదిపేసింది. స్వదేశంలో మరోసారి ఇలాంటి పరాభవం చూడబోమని అటు మాజీలు, ఇటు ఫాన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు టీమిండియాకు మరో వైట్వాష్ తప్పేలా లేదు. ఇప్పటికే కోల్కతా జరిగిన మొదటి టెస్టులో ఓడిన భారత్..…
IND vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాకు భారీ టార్గెట్ ను ముందు ఉంచింది. భారత్ భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ విజయం దిశగా పయనం చాలా దూరంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించడంతో టీమిండియాకు వైట్వాష్ భయం వెంటాడుతోంది. దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోర్ను చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ముత్తుస్వామి (109), జాన్సెన్ (93),…
భారత్తో గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పూర్తి పట్టు సాధించింది. ప్రస్తుతం నాలుగో రోజు కొనసాగుతోండగా.. లంచ్ బ్రేక్ సమయానికి రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 220 రన్స్ చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 508 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్ (60), వియాన్ ముల్డర్ (29) ఉన్నారు. ఈ జోడి 5వ వికెట్కు 71 బంతుల్లో 42 పరుగులు జత చేసింది. Also Read: Telangana Panchayat…
స్వదేశంలో బ్యాటింగ్, బౌలింగ్లో బెబ్బులిలా చెలరేగే భారత్.. దక్షిణాఫ్రికాకు సిరీస్ను కోల్పోవడం ఇక లాంఛనమే. మొదటి టెస్టులో దారుణ ఓటమిని చవిచూసిన టీమిండియా.. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్లో ప్రొటీస్ టీమ్ 489 రన్స్ చేయగా.. భారత్ 201 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 26 రన్స్ చేయగా.. 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుంది. టీమిండియాకు 400 రన్స్ లక్ష్యంను విధించే అవకాశం ఉంది.…
గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. తొలి ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 247 రన్స్ చేసింది. ముత్తుస్వామి (25), కైల్ వెరినె (1) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్స్ పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి రోజు…
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. 124 పరుగులను ఛేదించలేక 93 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 15 ఏళ్ల తర్వాత భారత్లో దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. అంతకుముందు కూడా టీమిండియాకు పరాజయాలు ఎదురయ్యాయి. వరుస ఓటములతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యం ప్రయోగాలు చేసే గౌతీని తప్పించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పదించింది. గంభీర్పై పూర్తి విశ్వాసం…
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండవ టెస్ట్ నేడు గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాంటింగ్ ఎంచుకుంది. గౌహతి వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం. భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా 0-1తో వెనుకబడింది. కోల్కతా టెస్ట్లో దక్షిణాఫ్రికా భారత్ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు, సిరీస్ను సమం చేయాలంటే భారత్ ఈ…
IND vs SA 2nd Test: గువాహటిలో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్కు ఈ మ్యాచ్ సిరీస్ భవితవ్యాన్ని నిర్ణయించేదిగా మారింది. తొలిసారిగా టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న బర్సాపారా స్టేడియంలోని పిచ్ స్వభావంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎర్రమట్టితో రూపొందించిన ఈ పిచ్ ప్రస్తుతం పచ్చికతో ఉన్నప్పటికీ, మ్యాచ్కు ముందునే దానిని కత్తిరించే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా ఎర్రమట్టి…