Ind vs SA: ఫలించని తిలక్ వర్మ ఒంటరి పోరాటం.. దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా చిత్తు..!
- ముల్లాన్పూర్లో భారత్పై దక్షిణాఫ్రికా 51 పరుగుల తేడాతో ఘన విజయం
- 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలం
- తిలక్ వర్మ 34 బంతుల్లో 62 పరుగులతో ఒంటరి పోరాటం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs SA: న్యూచండీగఢ్ లోని ముల్లాన్పూర్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియాకు భారీ పరాజయం మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.1 ఓవర్లలో కేవలం 162 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
Arshdeep Singh చెత్త రికార్డు.. ఒక ఓవర్ లో 13 బంతులు.. 7 వైడ్లు.. కోచ్ గంభీర్ ఆగ్రహం!
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
భారత ఇనింగ్స్ లో శుభ్మన్ గిల్ (0), అభిషేక్ శర్మ (17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) పూర్తిగా విఫలమయ్యారు. తొలి ఓవర్లోనే గిల్ డకౌట్ అవ్వగా, సూర్యకుమార్ కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇలా ఒకవైపు వికెట్లు వరుసగా పడుతున్నా తెలుగబ్బాయి తిలక్ వర్మ (Tilak Varma) ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసి జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మిగిలిన బ్యాటర్ల నుండి సరైన మద్దతు లభించలేదు. అక్షర్ పటేల్ (21), హార్దిక్ పాండ్యా (20), జితేశ్ శర్మ (27) స్వల్పంగా పరుగులు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు.
Ind vs SA 2nd T20I: క్వింటన్ డికాక్ విధ్వంసం.. టీమిండియాకు భారీ టార్గెట్..!
ఇక మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఒట్నీల్ బార్ట్మ్యాన్ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. లుంగీ ఎంగిడి (Lungi Ngidi), మార్కో జాన్సెన్ (Marco Jansen) చెరో 2 వికెట్లు, లుథో సిపామ్లా (Lutho Sipamla) 2 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను కుప్పకూల్చారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా, క్వింటన్ డికాక్ (90) విధ్వంసం కారణంగా 213/4 భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (2/29) మాత్రమే పర్వాలేదనిపించాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా పేలవమైన ప్రదర్శన కనబరచింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 1-1తో సమమైంది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..