విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని రానున్న కాలానికి అనుగుణంగా అనురాగ్ సెట్, అగ్రి సెట్ పేర్లతో ఎంట్రన్స్ పరీక్షలను అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అనురాగ్ సెట్ ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేయగా.. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి అగ్రి సెట్ను ఏర్పాటు చేశారు. అనురాగ్ సెట్, అగ్రి సెట్ పరీక్షలకు సంబంధించి తేదీని ఖరారు చేశారు. ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులను మార్చి 3 వరకు సమర్పించవచ్చని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. మార్చి…
హైదరాబాద్ నగరంలో కార్లను అద్దెకు తీసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును రాచకొండ పోలీసులు ఛేదించారు. అక్టోబర్ నెలలో అద్దె కారు చోరీకి గురైందని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని.. జూమ్ కార్స్ ద్వారా కారును అద్దెకు తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకపోవడంతో యజమాని ఫిర్యాదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశామని.. ఈ విచారణలో నిందితులు అద్దె కార్లతో…
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స కుమారుడి వివాహం హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ మేరకు సీఎం జగన్ దంపతులు వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు. అటు ఈ వివాహానికి టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ కూడా వచ్చారు. ఆయనను మంత్రి బొత్స కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవితో…
కరోనా కారణంగా వాయిదా పడ్డ నుమాయిష్ను ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ కొనసాగనుంది. ఇందుకోసం అన్ని శాఖల నుంచి అనుమతులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈమేరకు స్టాళ్ల నిర్వాహకులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ స్టాళ్ల నిర్వాహకులు సిద్ధంగా లేకపోతే ఫిబ్రవరి 25 నుంచి నుమాయిష్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల నుంచి అనుమతులపై రెండురోజుల్లో…
రాష్ట్ర విభజనపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ప్రధావి మోడీవి పనికిమాలిన కూతలుగా పేర్కొన్న ఆయన.. దేశానికి ప్రధానిగా ఇలా మాట్లాడతారా ? అని నిలదీశారు… తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోడీ ఎనిమిదేళ్ళ క్రితం అన్నారని గుర్తుచేసిన కేటీఆర్.. ఇప్పుడు మళ్లీ అసందర్భంగా మాట్లాడారని దుయ్యబట్టారు.. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు.. ఇక, విగ్రహావిష్కరణ కోసం…
ఈ దేశంలో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలు ఎక్కువ శాతం నడుపుతోంది హిందువులే… హిందువుల ముందు నిలబడే సామర్థ్యం ఎవరికి లేదని వ్యాఖ్యానించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్… హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో రామానుజాచార్య మిలీనియం వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం సనాత ధర్మంలో అన్ని ఉన్నాయి. దేశంలో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. మనం ఎవరో మనం మరిచిపోయాం అంతే.. ఇప్పుడు ప్రతి హిందువు ఇదే మరిచిపోయాడు. తనలోని బలం ఏంటో తనకు తెలియదు.…
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలిపే కుట్ర జరుగుతోందని.. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఓర్వలేక పోతున్నారంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించిన తలసాని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాల్సిందేనని…
వర్షకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో నాలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తుంటాయి. వచ్చే వర్షాకాలం నాటికి నాలాల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. నగరంలో ఎన్ని ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతున్నాయని, నాలాలకు ఫెన్సింగ్, రక్షణ గోడ వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. Read Also షాకింగ్: ఐఫోన్ కోసం ఆర్డర్ చేస్తే… నాలా ప్రమాదాలు జరిగితే ఇకపై అధికారులనే బాధ్యులను చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ…
ఈరోజుల్లో అడుగడుగునా మోసాలు జరుగుతున్నాయి. ఆటోలలో ప్రయాణించే ప్రయాణికుల సెల్ ఫోన్లు, బ్యాగ్ లు మిస్ అవుతున్నాయి. ఆటో డ్రైవర్లలో కొందరు తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ఆటోడ్రైవర్ నిజాయితీకి ప్రయాణికురాలు అభినందనలు తెలిపారు. నిజాయితీ గల ఆటో డ్రైవర్ సయ్యద్ జాకర్ తనకు లభించిన 10 తులాల బంగారాన్ని పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. లంగర్ హౌస్ కి చెందిన మీర్జా సుల్తాన్ బేగ్ హషమ్నగర్ నుండి టోలీచౌకి వైపు హోండా…
క్రమంగా కరోనా కేసులు దిగివస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవు అని ప్రకటించింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు… కోవిడ్ మూడో వేవ్ తెలంగాణలో ముగిసిపోయిందన్నారు.. థర్డ్ వేవ్ జనవరి 28న పీక్ చూశామన్న ఆయన.. ఆ తరవాత తగ్గుతూ వచ్చిందన్నారు.. పాజిటివిటీ రేట్ తగ్గింది… తెలంగాణలో 2 శాతం లోపే పాజిటివిటీ రేటు ఉందన్నారు.. ఇక,…