తెలంగాణలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు ఓయూ విద్యార్థి నాయకులు.. ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై సీపీకు ఫిర్యాదు చేశారు.. ఇక, నకిలీ సర్టిఫికెట్ వ్యవహారాన్ని ఉస్మానియా అధికారులు కూడా ధృవీకరించారు.. నకిలీ సర్టిఫికెట్ విషయాన్ని సీపీకి వివరించారు విద్యార్థి నేతలు… కన్సల్టేషన్, ఎడ్యుకేషన్, ఇనిస్టిట్యూట్స్ అడ్డగా ఈ దందా సాగుతుందని సీపీ దృష్టికి తీసుకెళ్లారు..…
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే.. అయితే, ఈ నెల 14వ తేదీన శాంతి కళ్యాణం జరగాల్సి ఉండగా.. శనివారం సాయంత్రం అనగా రేపు శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్టు వెల్లడించారు చిన్నజీయర్ స్వామి.. సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి రాత్రి 8 గంటల తర్వాత శాంతి కళ్యాణాన్ని పూర్తిచేయనున్నట్టు తెలిపారు.. రామానుజ చార్యుల సోపాన మార్గంలో కళ్యాణము నిర్వహిస్తామని.. 108 కళ్యాణాలు ఒకే చోట జరిగిన చరిత్ర లేదన్నారు.. ఇక,…
తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, ఆయన అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. అన్ని చోట్ల కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన టీఆర్ఎస్ యువజన నాయకుడు అలిశెట్టి అరవింద్ ప్రత్యేక అభిమానం చాటుతూ దేశంలోనే తొలిసారిగా బోటుపై బ్యానర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహం పక్కన ప్రత్యేకమైన బోటులో కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ…
తెలంగాణలో కరోనా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 41,310 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 453 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 1,380 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారిఉ.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,746 యాక్టివ్ కేసులు ఉండగా… మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 7,85,596కు, రికవరీ కేసులు 7,74,742కు పెరిగాయి.. మరోవైపు కోవిడ్…
హైదరాబాద్ నగరంలో మరోసారి మెట్రో రైళ్లు మొరాయించాయి. సాంకేతిక కారణాల వల్ల గురువారం రాత్రి మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లే మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలోని అసెంబ్లీ స్టేషన్లో సుమారు 20 నిమిషాలకు పైగా మెట్రో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల తరచూ మెట్రో రైళ్లు సాంకేతిక కారణాలతో నిలిచిపోతున్నాయని.. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా మెట్రో రైలు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో ఇటీవల…
రైతు బీమా పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బీమా వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది రైతులు ఉంటే.. కేవలం 32 లక్షల మందికి మాత్రమే బీమా చేశారని తన పిటిషన్లో పేర్కొన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగిలిన 34 లక్షల మంది రైతులకు భీమా వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుకు విన్నవించారు… అయితే, దీనిపై విచారణ…
తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఓ కటింగ్ షాపు ఓనర్ ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. జూబ్లీహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఫుట్పాత్పై బ్యానరు కట్టి ప్రజలకు కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని.. ఆయన పుట్టినరోజు కాబట్టి గత రెండేళ్లుగా తాను పేదవాళ్లకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కటింగ్, షేవింగ్…
సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్ కూతురు పెళ్లి వైభవంగా జరిగింది… సందీప్-సబీన దంపతుల కుమారుడు శుభంతో ఆలపాటి వెంకటేశ్వరరావు మనవరాలు, ఆలపాటి కృష్ణమోహన్-మాధవి గారాల పట్టి దివ్య వివాహాన్ని ఈ రోజు రాత్రి ఢిల్లీ ఎరో సిటీలోని ఓ హోటల్లో సందడిగా నిర్వహించారు.. పలువురు వివిధ రంగాలు చెందిన ప్రముఖులు హాజరై దివ్య-శుభం దంపతులను ఆశీర్వదించారు.. ఇక, దిగువన ఉన్న ఫొటోలో.. ఆలపాటి కృష్ణమోహన్ కుమారుడు ఆదిత్య, ఆలపాటి కృష్ణ మోహన్, శుభం (పెళ్లి…
ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు… కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల వ్యవహారం నుంచి.. రాజకీయ విమర్శల వరకు ఈ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమన్న చందంగా ఉంది పరిస్థితి.. అయితే, ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పీఎం మిత్రలో చేరాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. దాని కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.. వస్త్ర…
పసిడి ప్రేమికులకు షాకిస్తూ.. రూ.51 వేలకు పైగా చేరిన 10 గ్రాముల బంగారం ధర.. ఇప్పుడు మళ్లీ కిందకు దిగింది.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.50 వేల దిగువకు పడిప్ఓయింది.. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు.. దేశీయంగా డిమాండ్ కాస్త తగ్గడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర కిందకు దిగివచ్చిందంటున్నారు.. దాదాపు ఒక ఏడాది తర్వాత ఢిల్లీ మార్కెట్లో గరిష్ట స్థాయి ధరను రూ.50,350కు…