BJP: స్పీకర్పై గవర్నర్కు బీజేపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్రావులను… స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డు తగిలారంటూ… మంత్రి తలసాని తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని ఆమోదించిన సభాపతి… ముగ్గురిపై ఈ సమావేశాల ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. ముగ్గురు ఎమ్మెల్యే సస్పెన్షన్పై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. రెండు నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందన్నారు. ఇక, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా… రాజ్యాంగాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కేసీఆర్కు… సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిసి… ఫిర్యాదు చేశారు.
Read Also: Women’s Day 2022: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు.. మానవ జాతికి మహిళ ఒక వరం
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
రాష్ట్ర శాసనసభలో జరిగిన ఘటనపై గవర్నర్ కి వివరించామని.. గవర్నర్ ను పిలవక పోవడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పామని.. మేం మూడో వరుసలో నిలబడి ఉన్నాం.. కాంగ్రెస్ నేతలు మొదటి వరుసలో ఐదుగురు నిలబడ్డారు.. స్పీకర్ కు నివేదించేందుకు కొంత ముందుకు వెళ్లారు రాజాసింగ్, గతంలో స్పీకర్ లు ఇలా వ్యవహరించి ఉంటే మీరు ఇలా ఉండేవారా అని ప్రశ్నించారు రఘునందన్ రావు.. ఈ రోజు జరిగిన ఘటన నాలుగున్నర కోట్లమందికి జరిగిన అవమానం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడమని రిప్రజెంటేషన్ ఇవ్వమని అడిగాం, కచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పారన్నారు.. ఇక, గత దశాబ్ద కాలంగా వస్తున్న సాంప్రదాయాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు ఈటల రాజేందర్.. కెసీఆర్ వ్యవహారం జుగుప్సాకరంగా ఉందన్న ఆయన.. అందరూ నేను చెప్పినట్టు వినాలనుకుంటున్నారు. ప్రజలు సిగ్గు తలదించుకునేలా చేసారు.. భవిష్యత్తు లో ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరితే మా మొహాలు చూడకూడదు అని సస్పెండ్ చేశారని మండిపడ్డ ఆయన.. మాపై జరిగిన దాడిని ప్రజలకు వివరిస్తాం.. అతిపెద్ద రాజ్యాంగం మనది… ప్రజాస్వామ్యం కాపాడే ప్రయత్నం చేస్తాఅని గవర్నర్ హామీ ఇచ్చారు తెలిపారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?