KCR: మత పిచ్చితో సమాజానికి నష్టం.. ఆ క్యాన్సర్ మనకొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వనపర్తి బహిరంగ సభా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశంలో గోల్ మాల్ గోవిందం గాళ్లు మోపు అయ్యారని.. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలకు మత పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. దుర్మార్గమైన చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. చైతన్యం ఉన్న గడ్డగా, తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకాన్ని తెలంగాణలో రానివ్వను అని ప్రకటించిన కేసీఆర్.. మనందరం ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు.. కులం, మతం, జాతి లేకుండా ప్రజలంతా బాగుపడాలని ఆకాక్షించారు.
Read Also: RK Roja: వాళ్లేంటి? 23 మంది రాజీనామా చేసి గెలిస్తే.. నేనే పోటీ చేయను..
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
ఎన్నో అవమానాలు, అవహేళనలను తట్టుకొని రాష్ట్రం సాధించుకున్నాం.. రాష్ట్రం సాధించుకున్న ప్రతిఫలం కళ్లముందు కనిపిస్తుందన్నారు కేసీఆర్.. ఒకప్పుడు ఒక మెడికల్ కళాశాల కూడా లేదు. ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కళాశాల సాధించుకున్నాం.. హైదరాబాద్ నుండి గద్వాల.. వరకు ఎక్కడ చూసినా పచ్చదనం ఉందన్నారు.. పాలమూరు జిల్లా పాలుగారుతోంది.. పాలమూరు పూర్తి చేస్తే అద్భుతమైన వజ్రపు తునక అవుతుందన్నారు.. 15 లక్షల మంది వలస పోయే వారు.. ఇప్పుడు రాయచూరు, కర్నూలు నుండి వలస వస్తున్నారన్న ఆయన.. 11 జిల్లాల నుండి మన వలస కూలీలు మన సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చారని తెలిపారు.. నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరుపెట్టాను.. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇచ్చానన్న ఆయన.. ఈసారి నిరంజన్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.. ఇక, ఈ సందర్భంగా పాలమూరు సాధించిన ప్రగతిపై పాట పాడారు సీఎం కేసీఆర్.. పట్టుబడితే, జట్టు గడితే బంగారు తెలంగాణ సాధ్యమైంది.. దేశం కూడా ఇట్ల అభివృద్ధి కావాలన్నారు.. ఇక, ప్రజలకు మత పిచ్చి లేపుతున్నారు.. అలాంటి వారికి బుద్ధి చెప్పాలన్న కేసీఆర్.. దేశం కోసం పోరాటానికి పోదామా అంటూ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మంచిని పెంచేందుకు ముందుకు పోయేందుకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను.. మత పిచ్చి, కుల పిచ్చి వల్ల సమాజానికి నష్టం అని.. ఈ దేశంలో మంచిని కాపాడటానికి.. మంచిని పెంచడానికి అవసరమైతే నా ప్రాణాన్ని కూడా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. అదే పద్ధతిలో ముందుకు వెళ్లాలని.. బుద్ధి తక్కువ పార్టీలు, వెదవలు.. వాళ్ల చిల్లర రాజకీయాల కోసం దేశాన్నే, భారత జాతినే బలి పెట్టేటువంటి విష ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైతన్యవంతమైన తెలంగాణ మేధావులు.. దయచేసి దాన్ని తిప్పి కొట్టాలి. భయంకరమైనటువంటి ఆ వ్యాధి ఆ క్యాన్సర్ మనకు రాకుండా చూసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..