KCR: మత పిచ్చితో సమాజానికి నష్టం.. ఆ క్యాన్సర్ మనకొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వనపర్తి బహిరంగ సభా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశంలో గోల్ మాల్ గోవిందం గాళ్లు మోపు అయ్యారని.. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలకు మత పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. దుర్మార్గమైన చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. చైతన్యం ఉన్న గడ్డగా, తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకాన్ని తెలంగాణలో రానివ్వను అని ప్రకటించిన కేసీఆర్.. మనందరం ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు.. కులం, మతం, జాతి లేకుండా ప్రజలంతా బాగుపడాలని ఆకాక్షించారు.
Read Also: RK Roja: వాళ్లేంటి? 23 మంది రాజీనామా చేసి గెలిస్తే.. నేనే పోటీ చేయను..
Also Read
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ఎన్నో అవమానాలు, అవహేళనలను తట్టుకొని రాష్ట్రం సాధించుకున్నాం.. రాష్ట్రం సాధించుకున్న ప్రతిఫలం కళ్లముందు కనిపిస్తుందన్నారు కేసీఆర్.. ఒకప్పుడు ఒక మెడికల్ కళాశాల కూడా లేదు. ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కళాశాల సాధించుకున్నాం.. హైదరాబాద్ నుండి గద్వాల.. వరకు ఎక్కడ చూసినా పచ్చదనం ఉందన్నారు.. పాలమూరు జిల్లా పాలుగారుతోంది.. పాలమూరు పూర్తి చేస్తే అద్భుతమైన వజ్రపు తునక అవుతుందన్నారు.. 15 లక్షల మంది వలస పోయే వారు.. ఇప్పుడు రాయచూరు, కర్నూలు నుండి వలస వస్తున్నారన్న ఆయన.. 11 జిల్లాల నుండి మన వలస కూలీలు మన సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చారని తెలిపారు.. నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరుపెట్టాను.. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇచ్చానన్న ఆయన.. ఈసారి నిరంజన్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.. ఇక, ఈ సందర్భంగా పాలమూరు సాధించిన ప్రగతిపై పాట పాడారు సీఎం కేసీఆర్.. పట్టుబడితే, జట్టు గడితే బంగారు తెలంగాణ సాధ్యమైంది.. దేశం కూడా ఇట్ల అభివృద్ధి కావాలన్నారు.. ఇక, ప్రజలకు మత పిచ్చి లేపుతున్నారు.. అలాంటి వారికి బుద్ధి చెప్పాలన్న కేసీఆర్.. దేశం కోసం పోరాటానికి పోదామా అంటూ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మంచిని పెంచేందుకు ముందుకు పోయేందుకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను.. మత పిచ్చి, కుల పిచ్చి వల్ల సమాజానికి నష్టం అని.. ఈ దేశంలో మంచిని కాపాడటానికి.. మంచిని పెంచడానికి అవసరమైతే నా ప్రాణాన్ని కూడా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. అదే పద్ధతిలో ముందుకు వెళ్లాలని.. బుద్ధి తక్కువ పార్టీలు, వెదవలు.. వాళ్ల చిల్లర రాజకీయాల కోసం దేశాన్నే, భారత జాతినే బలి పెట్టేటువంటి విష ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైతన్యవంతమైన తెలంగాణ మేధావులు.. దయచేసి దాన్ని తిప్పి కొట్టాలి. భయంకరమైనటువంటి ఆ వ్యాధి ఆ క్యాన్సర్ మనకు రాకుండా చూసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
-
PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!