తెలంగాణ మంత్రి కె. తారకరామారావు అమెరికా పర్యటనలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సుమారు 150 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది కెమ్ వేద లైఫ్ సైన్సెస్. హైద్రాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఈకో సిస్టంను ఈ డెవలప్మెంట్ సెంటర్ మరింత బలోపేతం చేస్తుందని చెబుతున్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీలో భాగం…
దేశవ్యాప్తంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై పెద్ద చర్చ సాగుతోంది.. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా లేకపోలేదు.. దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూలు చేసింది.. ఈ చిత్రంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సినిమాపై మండిపడ్డారు.. ఇవాళ తెలంగాణ భవన్లో…
కేంద్రంపై మరోసారి పోరుకు సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ.. టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై చర్చించనున్నారు. యాసంగి ధాన్యాన్ని వందశాతం కేంద్రం ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడిచేసేందుకు చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. Read Also:…
తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభం కాబోతోంది.. రాష్ట్రవ్యాప్తంగా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయబోతున్నామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఒకేసారి 91 వేలకుపైగా ఉద్యోగాల భర్తీని ప్రకటించిన ఆయన.. వరుసగా నోటిఫికేషన్లు ఉంటాయని వెల్లడించారు.. ఇక, పలు జిల్లాల్లో నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నారు.. ఆరు నెలలు సినిమాలకు, సోషల్ మీడియాకు, మొబైల్ ఫోన్లకు.. దూరంగా ఉండడం.. కష్టపడండి.. మీ తల్లిదండ్రుల కలను…
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించారు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్.. ఎన్నో ప్రాజెక్టులను, కొత్త సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టేలా చేశారు.. ఇక, రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు బయల్దేరింది.. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్ టీమ్.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి…
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.. రికార్డు స్థాయిలో ఉష్ట్రోగ్రతలు పెరిగిపోతుండటంతో మధ్యాహ్నం వేళ ప్రజలు బయట అడుగుపెట్టడానికి భయపడి పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నంద్యాల, రెంటచింతల ప్రాంతాల్లో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో కూడా 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. ఓవైపు ఎండలు మరోవైపు వడగాలులు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఇక, మరో మూడు రోజులపాటు ఎండలు, వడగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. ఎండకు…
సోషల్ మీడియా ఇప్పుడు ఎంతో మందికి చేరువైపోయింది.. పిల్లలు, యూత్, పెద్దలు అనే తేడా లేకుండా అంతా సోషల్ మీడియాలో అడుగు పెడుతున్నారు.. యాక్టివ్గా ఉంటున్నారు.. అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఇక, ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఇలా.. ఎంతో మంది తమ కార్యక్రమాలు, కార్యాచరణ అన్నీ షేర్ చేసుకుంటున్నారు.. ఇదే సమయంలో.. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఖాతాలను హ్యాకర్స్ బెడద వెంటాడుతూనే ఉంది.. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీల…
నేడు కడపలో బీజేపీ బహిరంగసభ, రాయలసీమ రణభేరి పేరుతో బీజేపీ సభ, హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి, పురంధేశ్వరి, ఇతర రాష్ట్ర నేతలు. నేడు మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్కు కీలక మ్యాచ్, ఆక్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత మహిళల జట్టు. పంజాబ్లో ఇవాళ కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం.. ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో కేబినెట్ ప్రమాణస్వీకారం. ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు నిరసనలకు టీడీపీ పిలుపు, నాటుసారా నిషేధించాలంటూ టీడీపీ ఆందోళన. ఒంగోలు ఇవాళ్టి నుండి…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రాత్రి కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వెళ్తున్న మహేంద్ర థార్ కారు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో బ్రిడ్జి దిగి కొంతదూరం వెళ్లగానే రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నరేళ్ల బాలుడు కిందపడిపోయింది.. తలకి తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ఆ బాలుడు కన్నుమూశారు.. ఈ ప్రమాదంలో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది..…
నేడు రష్యా – ఉక్రెయిన్ మధ్య మరోసారి చర్చలు. నేడు దేశవ్యాప్తంగా హోలీపండుగ. శ్రీకాకుళం జిల్లా మడపాo గ్రామంలో నేడు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. విశాఖ ఋషికొండలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో నేడు మహాసంప్రోక్షణ. నేటి రాత్రి 7గంటల నుంచి ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ… మార్చి 23వ తేదీన విగ్రహప్రతిష్ట విశాఖ: సింహాచలం వరాహాలక్ష్మి నృసింహ్మస్వామి సన్నిధిలో డోలోత్సవం… నేటి నిత్య కళ్యాణం రద్దు.. అనంతపురం…