Cab Charges: ఇంధన ధరల ఎఫెక్ట్.. క్యాబ్లలో ఏసీలు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో వాహనం లేని వారు ఎక్కువగా క్యాబ్లను ఆశ్రయిస్తుంటారు. వీరిలో చాలా మంది ఉబర్, ఓలా క్యాబ్లను బుక్ చేస్తుంటారు. అలాంటి వారికి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ చేదువార్తను అందించింది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా త్వరలో క్యాబ్ ఛార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇంధన ధరల కారణంగా ఈనెల 29 నుంచి ఓలా, ఉబర్ క్యాబ్లలో ఏసీలను బంద్ చేస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సల్లావుద్దీన్ వెల్లడించారు.
వేసవి కారణంగా ఒకవేళ ఓలా, ఉబర్ క్యాబ్లలో ప్రయాణించేవారు ఏసీ కావాలనుకుంటే అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుందని షేక్ సల్లావుద్దీన్ తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఏసీతో క్యాబ్లను నడపడం సాధ్యం కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఓలా, ఉబర్ కంపెనీలు సైతం కమీషన్ రేట్లు పెంచడం లేదని.. అందుకే క్యాబ్లలో ఏసీని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఏసీ ఆన్ చేస్తే క్యాబ్ డ్రైవర్లు రోడ్డున పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం చొరవ తీసుకొని కనీస ధరలను నిర్ణయించి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సల్లావుద్దీన్ కోరుతున్నారు.
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.