Wings India Aviation Show: ఏవియేషన్ షో అట్టర్ ఫ్లాప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో వింగ్స్ ఇండియా ఏవీయేషన్ షో (Wings India Aviation Show) అట్టర్ ఫ్లాప్ అయ్యింది. వివిధ సంస్థల ఉత్పత్తుల ప్రదర్శన దగ్గర నుంచి ఏర్పాట్లు వరకూ అన్ని ఫెయిలయ్యాయి. దీంతో ఈ ప్రదర్శనకు విచ్చేసిన సందర్శకులు పెద విరుస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయి వింగ్స్ ఇండియా 2022కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగంలో గల అనేక సంస్థలు తమ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించాయి. దేశ, విదేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు కొలువుదీరాయి. ఆంబ్రియర్ సంస్థకు చెందిన అతి పెద్ద విమానం E195-E2 కూడా సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. కొత్త తరం ఈ-జెట్స్ కుటుంబానికి చెందిన విమానాల్లోనే E195-E2 అతి పెద్దది. ఇందులో 146 మంది ప్రయాణించే వీలుంటుంది. ముఖ్యంగా మన దేశంలోని చిన్న నగరాల్లో గల టూ టైర్, త్రీటైర్ విమానాశ్రయాలకు ఈ-జెట్స్ చాలా అనుకూలంగా ఉంటాయంటున్నారు.
Also Read
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై 'ఈగల్ ఫోర్స్' ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
- Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
- Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్చేంజ్.!
ఏవియేషన్ షో భారీ విమానం ఎయిర్ బస్-350 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెలికాప్టర్లు, డ్రోన్ల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా… షోకు విచ్చేసిన సందర్శకులు పూర్తి స్థాయిలో సంతృప్తిపర్చలేకపోయింది. ఏవియేషన్ షో టికెట్ ధర 600 రూపాయలు. ఈ ఖర్చు పెట్టి వస్తున్న సందర్శకులు… చాలా ఉత్పత్తుల్ని చాలా దూరం చూడాల్సి వస్తోంది. బారికేడ్లను దాటి వెళ్లనివ్వడం లేదు నిర్వాహకులు. అంతే కాదు… ఆయా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల విశేషాల గురించి వివరించే నాథుడే లేడు. ఈ ఏవియేషన్లో దాదాపు 200 సంస్థలకు చెందిన ఉత్పత్తులు కొలువుదీరుతాయని నిర్వాహకులు చెప్పినా… ఆ స్థాయిలో ప్రదర్శన కనిపించడం లేదు. ఈ సారి పెద్దగా ప్రెజంటేషన్లు ఇవ్వలేదు… కాన్ఫరెన్స్లు కూడా అంతగా జరగలేదు. ఫలితంగా చెప్పుకో దగ్గ స్థాయిలో MOUలు కుదర్లేదు.
ఏవియేషన్ షోను చూసేందుకు వస్తున్న సందర్శకులకు కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదు నిర్వాహకులు. 30 రూపాయలు పెట్టి మంచినీటి బాటిల్ కొనుక్కోవాల్సిందే. అలాగే, ఆహార పదార్థాల ధరలు కూడా అధికంగా ఉన్నాయని సందర్శకులు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లాపాపలతో వచ్చిన వాళ్లు ఇబ్బందిపడ్డారు. ఈ ఎగ్జిబిషన్లో సందర్శకులకు కనీసం నిలువ నీడ కూడా లేకపోవడంతో… వేసవి తాపానికి అల్లాడిపోయారు. మొత్తానికి అంతర్జాతీయ స్థాయి ఏవియేషన్ షో ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు ఘోరంగా విఫలమయ్యారు.
తాజావార్తలు
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్కు ముప్పు పొంచి ఉందా?
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!