తెలంగాణలో ఒంటిపూట బడులకు సమయం ఆసన్నమైంది.. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.. ఇక, ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ.. ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిగంటలుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది… ఇక, మే 20వ తేదీన 10వ తరగతులు ముగియనున్నాయి.. అంటే, అదే రోజు స్కూళ్లకు చివరి పనిదినం కానుంది. ఇక,…
హైదరాబాద్లో రూపుదిద్దుకుంటున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ వల్ల హైదరాబాద్ ఖ్యాతి మరింతగా పెరుగుతుందన్నారు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. గచ్చిబౌలి లో IAMC నిర్మాణానికి భూమిపూజ చేశారు చీఫ్ జస్టిస్ ఎన్.వీ. రమణ. భారతదేశంలో మొదటి IAMC అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విశేషం అన్నారు. IAMC నిర్మాణానికి గచ్చిబౌలి లోని ఐకియా వద్ద 3.7 ఎకరాల భూమిని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి మంత్రులు…
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఎంఐఎం రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ ప్రశ్నిస్తుండగా.. కేసీఆర్ను ఎంపీ అసదుద్దీన్ ప్రశంసించారు. కేసీఆర్ను మొండి మనిషి అంటూ ఎంపీ అసదుద్దీన్ ప్రశంసించారు.. కేసీఆర్ గతంలో కంటే యాక్టివ్ అయ్యారన్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్ యాక్టివ్గానే ఉండాలన్నారు.. ఇక, దేశంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను మించిన నాయకుడు మనకు లేరన్నారు ఒవైసీ.. దేశ రాజకీయాలపై కేసీఆర్…
మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్ నగరంలోని యాప్రాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఫుట్బాల్ టోర్నీ ముగిసింది. స్కైకింగ్స్ సహకారంతో ఒలింపియన్ అసోసియేషన్ యాప్రాల్లోని మెహర్బాబా కాలనీలో ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసింది. ఈ టోర్నీకి ముఖ్య అతిథిగా నేరేడ్మెట్ 136వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొత్తపల్లి మీనా ఉపేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తి గల మహిళలందరూ ఫుట్బాల్ లీగ్లో పాల్గొనేందుకు ముందుకు రావాలని ప్రోత్సహించారు. మహిళలందరూ తమ లక్ష్యాలను సాధించడానికి…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభమైన తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించడంపై నిరసనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ల ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ తీర్మానం పెట్టడం.. దానికి స్పీకర్ అంగీకరించడం జరిగిపోయాయి. అయితే, దీనిపై న్యాయపోరాటానికి దిగారు బీజేపీ ఎమ్మెల్యేలు.. తమ సస్పెన్షన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు.. ఆ…
తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి 1.79 కోట్ల (46.84 శాతం) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75 శాతం) కంటే ఇది దాదాపు 12 శాతం అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా మరో 10.48 శాతం పెరిగి 2.20 కోట్లకు చేరుతుందని నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అధికారులు భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా…
వనపర్తి బహిరంగ సభా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశంలో గోల్ మాల్ గోవిందం గాళ్లు మోపు అయ్యారని.. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలకు మత పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. దుర్మార్గమైన చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. చైతన్యం ఉన్న గడ్డగా, తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకాన్ని తెలంగాణలో రానివ్వను అని ప్రకటించిన కేసీఆర్..…
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ చెన్నై నుంచి హైదరాబాద్ కి మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇక్కడే ఒక ఇల్లు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇకనుంచి ఇక్కడే ఉండనున్నదట. క్రాక్ చిత్రంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకునన్ వరలక్ష్మీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది. ఇక ఒక పక్క కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంటే టాలీవుడ్ లో తన ప్రత్యేకతను చాటుతుంది. అయితే సడెన్ గా అమ్మడు చెన్నై…
శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్రావులను… స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డు తగిలారంటూ… మంత్రి తలసాని తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని ఆమోదించిన సభాపతి… ముగ్గురిపై ఈ సమావేశాల ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. ముగ్గురు ఎమ్మెల్యే సస్పెన్షన్పై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. రెండు నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందన్నారు. ఇక, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా… రాజ్యాంగాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు…
తెలంగాణ సర్కార్, గవర్నర్ మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది.. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంపై ఇప్పటికే ఘాటుగా స్పందించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఇక, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్న ఆమె.. అత్యున్నత పదవిలో ఉన్నవారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక, నన్ను ఎవరూ భయపెట్టలేరని..…