ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఎదురుచూస్తోన్న వారికి గుడ్న్యూస్ చెప్పింది హైకోర్టు.. ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది.. దీంతో సినిమా విడుదలకు ఎలాంటి అడ్డుంకులు లేకుండా.. అన్నీ తొలగిపోయాయి.. కాగా, అల్లూరి సీతారామరాజు, కొమ్రంభీం చరిత్రను వక్రీకరించారంటూ అల్లూరి సౌమ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారాజు, కొమ్రంభీంలను దేశభక్తులుగానే చూపామని హైకోర్టుకు నివేదించారు ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకనిర్మాతలు.. ఇక,…
పంజాబ్లో విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో మరింత జోష్ పెరిగింది.. ఇక, ఇప్పటికే తెలంగాణలో రాజకీయ నేతలు పాదయాత్రలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.. మరికొన్ని పాదయాత్రలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.. మరోవైపు.. ఇప్పుడు తెలంగాణలో ఆమ్ఆద్మీ పార్టీ కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైంది.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల పై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుందని…
భవిష్యత్తులో హైదరాబాద్కు తాగునీటి సమస్య రాదని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్… అసెంబ్లీ మాట్లాడిన ఆయన.. 111 జీవో పరిధిలో లక్షా 32 వేల 600 ఎకరాల భూమి ఉందని తెలిపారు.. 83 గ్రామాలు, 6 మండలాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయని వెల్లడించిన ఆయన.. జంట జలాశయాలు కలుషితం కాకుండా 111 జీవో ప్రకారం నిషేధం ఉందని.. కానీ, హైదరాబాద్కు ఇప్పుడు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాలు అవసరం లేదన్న ఆయన.. కృష్ణా, గోదావరి జలాలు…
అసెంబ్లీ వేదికగా ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు.. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని వెల్లడించారు.. సెర్ప్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించారు.. అయితే, ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ పొరపాటు చేయవద్దని సూచించిన ఆయన.. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐకేసీ, మెప్మా ఉద్యోగులకూ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనలు ఇస్తామని పేర్కొన్నారు.. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై…
శాసనసభలో స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్తానాలు సరిదిద్దలేవని, ఆ బాధ్యత స్పీకర్దే అని హైకోర్టు పేర్కొందని సస్పెన్షన్కు గురైన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఐతే, స్పీకర్ తన గౌరవాన్ని నిలబెట్టుకోలేదని, ఇది నియంతృత్వానికి దారి తీస్తుందని ఈటల అన్నారు. ఈ అంశంపై సభ అభిప్రాయం కోరమని అడిగినా స్పీకర్ పట్టించకోలేదన్నారాయన. స్పీకర్ వ్యవహార శైలి చూస్తుంటే ఉత్తర కొరియా గుర్తుకు వస్తోందని, చప్పట్లు కొట్టలేదని అక్కడ కాల్చి చంపారని, అలాగే అసెంబ్లీ లో చప్పట్లు కొట్టలేదని…
హైదరాబాద్ జేఎన్టీయూలో ఈనెల 15, 16 తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ సురేష్ వెల్లడించారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద్య వరకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. అన్ని రకాల కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాధారణ డిగ్రీలు…
సాధారణంగా మనం చెప్పులు లేకుండా నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఓ కళాకారిణి ఏకంగా చెప్పులు లేకుండా 9,999 మేకులపై కూచిపూడి నృత్యం చేసి అందరినీ అబ్బురపరిచింది. అంతేకాకుండా పలు ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో యువ నర్తకి పీసపాటి లిఖిత 9 నిమిషాలపాటు అమ్మవారిని స్తుతిస్తూ చేసిన కూచిపూడి నృత్యం అలరించింది. ముఖ్యంగా తొమ్మిది దుర్గావతారాలను లయబద్ధంగా…
హైదరాబాద్ నగరంలో అందరూ ఎదురుచూస్తున్న ఎయిర్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈనెల 24 నుంచి వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఎయిర్ షోను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్టు వేదికగా పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు నగరవాసులను కనువిందు చేయనున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శనలు కొనసాగనున్నాయి. కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో దాదాపు…
నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలవగానే భయంతో సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారని ఎద్దేవా చేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఒక్కొక్కరు మిసైల్ లాంటి వారు.. మహిళలు కోరుకునేది సమాజంలో గౌరవం.. మహిళ అంటే భాధ్యత.. భాధ్యత అంటే మహిళ అన్నారు.. సభ్యత, సంస్కారం నేర్పించేది మహిళ.. సమాజంలో డ్రగ్స్ కి బానిసై యువత… తల్లి, చెల్లి అనే బేధం లేకుండా మానభంగాలకు పాల్పడుతున్నారని…
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్లో ఓ బాలుడి తల కలకలం సృష్టించింది… వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహార గేట్ 1 దగ్గర ఓ శిశువు తల కుక్క నోట్లో పట్టుకుని తీసుకొచ్చింది. ఊహించని ఘటనతో స్థానికులు షాక్ తిన్నారు. సహర గేట్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో శిశువు తలను పట్టుకొచ్చింది కుక్క.. పక్కనే ఉన్న పాల బూత్ యజమాని కుక్కని తరిమేసి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..…