తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. తాజాగా సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతోంది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటుచేస్తామని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ సోమవారం నాడు ప్రకటించారు. 2025 నాటికి తొలిదశ ప్రారంభం అవుతుందని తెలిపారు. తర్వాత దశలవారీగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ పరిశ్రమల…
మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్రం చట్టం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో శివరామకృష్ణ కమిటీ వేసి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. కానీ చంద్రబాబు నారాయణ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారని బొత్స ఆరోపించారు. రాజధానిపై ఆనాటి ప్రకటన ఏదైనా పార్లమెంట్కు పంపలేదు కాబట్టి హైదరాబాదే 2024 వరకు రాజధాని అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాజధాని…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో 3వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా అన్నారు ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. ఉదయం 11.30 నిమిషాలకు శాసన సభలో తాను ,మండలి లో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. కోకాపేట్ లో తన నివాసం నుంచి బయలుదేరాక మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా, ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు హరీష్ రావు. మానవీయ కోణంలో ఈ…
వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ను గెలవడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డ కాషాయ అడ్డా అని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్లోని ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేస్తామని తెలిపారు. యూపీలో నిర్మిస్తున్న రామమందిరం నిర్మాణం తరహాలో పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తామని ప్రకటించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నిర్మాణంతో పాతబస్తీలోని టూత్ పాలిష్ ఐకాన్లన్నీ కొట్టుకుపోతాయని బండి సంజయ్ పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి…
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో జెండర్ ఫర్ ఈక్వాలిటీ రన్ నిర్వహించారు. ఈ రన్ లో వందలాది మంది యువతులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా హాజరయ్యారు నగర సీపీ సీవీఆనంద్, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్. పాల్గొన్న పలువురు ఐపీఎస్ లు. సిటీలో 80 మంది మహిళాఎస్ఐలు పోలీసులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా మొదటి మహిళా…
కేంద్రమంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఉగాది సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ ఉత్సవాలకు చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆహ్వానించారు. ఈ ఉత్సవాలు ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. ఈ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్లో వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద, గిరిజన కళారూపాలు, నృత్యాలు, సంగీతం, వంటకాలు, సంస్కృతులు దర్శనమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో కిషన్రెడ్డి తన నివాసానికి వచ్చిన విషయాన్ని మెగాస్టార్…
జాతీయస్థాయిలో మరో కొత్త ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.. అయితే, కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉండబోదని స్పష్టం చేశారు. ఏదేమైనా మరో ఫ్రంట్పై చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.. అయితే, మీడియా చిట్చాట్లో టి.పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్ ఫ్రంట్ సినిమాకు డైరెక్టర్ (ప్రశాంత్ కిషోర్) పీకే, ప్రొడ్యూసర్ నరేంద్ర మోడీ.. నటుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా…
ఈనెల 6న ఆదివారం ఉదయం షీ టీమ్స్ ఆధ్వర్వంలో 5కే రన్, 2కే రన్ నిర్వహించనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు పీపుల్స్ ప్లాజా నుంచి లేపాక్షి, ట్యాంక్ బండ్, పీవీఎన్ఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను షాదాన్ కాలేజ్, నిరంకారీ భవన్…
తెలంగాణలో జేఎన్టీయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలపై సందిగ్ధత నెలకొంది… షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి (సోమవారం) నుండి జేఎన్టీయూ ఇంజినీరింగ్ పరీక్షలు జరగాల్సి ఉంది.. అయితే, ఇప్పటి వరకు విద్యార్థులకు హాల్ టికెట్స్ అందకపోవడం పెద్ద చర్చగా మారింది.. మరోవైపు, పరీక్షలు నిర్వహిస్తే ఇవ్వాల్సిన ఆన్సర్ షీట్స్ కూడా ఇప్పటి వరకు కాలేజీలకు చేరకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ఆయా కాలేజీల యాజమాన్యాలు. అయితే, దీనికి ఫీజుల వ్యవహారమే అడ్డుగా మారినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, కాలేజీలు కామన్…
టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి.. రేవంత్పై ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మల్లు రవి.. వీహెచ్ నాకు అన్న లాంటివారు.. కానీ, ఆయన వ్యాఖ్యలు ఖండిస్తున్నానని పేర్కొన్నారు.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కంటే ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అని గుర్తుచేసిన ఆయన.. బీహార్ ఐఏఎస్, ఐపీఎస్లకు పోస్టులు ఇవ్వొద్దు అని రేవంత్ ఎక్కడా…