Pudding and Mink Drugs case: పోలీసులపై ఒవైసీ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో రేవ్ పార్టీ వ్యవహారం సంచలనం సృష్టించింది.. రాడిసన్ బ్లూ హోటల్లోని పుడింగ్ మింక్ పబ్లో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులపై సెటైర్లు వేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ… డ్రగ్స్ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఎంఐఎం ఎంపీ… డ్రగ్స్ కేసులో పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు… కేవలం పబ్ ఓనర్లనే అరెస్ట్ చేశారని విమర్శించిన ఒవైసీ.. బడాబాబుల పిల్లలందరినీ వదిలేశారని పేర్కొన్నారు.. ఇక, సంపన్న వర్గాలు, పేదలకు ఒకే రకమైన న్యాయం జరగదా? అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.. తన ట్వీట్ను తెలంగాణ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ట్యాగ్ చేశారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..
Read Also: Pakistan Crisis: రాజకీయ సంక్షోభంలో మరో ట్విస్ట్.. ఇమ్రాన్కు షాక్..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
మరోవైపు డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రిమాండ్ రిపోర్ట్లో పూర్తి విషయాలను పేర్కొన్నారు బంజారాహిల్స్ పోలీసులు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.40 గంటలకు పబ్కు సంబంధించిన సమాచారం వచ్చిందని.. రాడిసన్ బ్లు హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో తెళ్లవరజామున 4 గంటలకు కోకైన్ సరఫరా చేస్తున్నరేని సమాచారం అందిందని.. ఈజీ మనీ కోసమే నిర్వాహకులు డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు.. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఉన్నత అధికారులకు సమాచారం చేర వేశామని.. 1985 NDPS యాక్ట్ u/s 42(2) కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.. క్లూస్ టీమ్కు సమాచారం అందించి.. పబ్పై 2 గంటల ప్రాంతంలో దాడి చేసినట్టు తెలిపారు.. దాడి చేసే ముందు తమ వెంట ల్యాప్ టాప్, మినీ ప్రింటర్, వెయింగ్ మెషిన్, ప్యాకింగ్ మెటీరియల్ వెంట తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు.. పబ్లోకి ఎంటర్ కాగానే మేనేజర్ అనిల్ కుమార్ను కలిసి దాడి సమాచారం ఇచ్చామని ఇప్పటికే ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు.. క్లూస్ టీమ్తో కలిసి పబ్పై దాడి చేశామని.. పబ్లో అనిల్, ప్రవీణ్లను మధ్యవర్తులుగా పెట్టుకుని వారి సమక్షంలో దాడులు చేశామన్నారు.. మేనేజర్ అనిల్ కుమార్ వద్ద ప్లాస్టిక్ ట్రేలో కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.. మొత్తం 5 ప్యాకెట్లలో 4.64 గ్రాములు తెల్ల పౌడర్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.. పబ్లోనే ఉన్న పాట్నర్ అభిషేక్ను అదుపులోకి తీసుకున్నామని.. అతడి మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు.
Rule of law is supreme Art 13 & it is very unfortunate that cocaine was found in this “Rave party” and all offspring’s of Rich kids where released not a single arrest apart from the owner of the place
Law should be applied equally to poor & rich @CPHydCity @KTRTRS https://t.co/WehHaS5BTK— Asaduddin Owaisi (@asadowaisi) April 6, 2022
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!