తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. ఈ మేరకు యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది.
రాజకీయాల కోసమే ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని సవాల్ విసిరారు.
సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ రాత్రి 11.30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ తో పాటు వరంగల్ రహదారిపై కూడా పోలీసులు ట్రాపిక్ ఆంక్షలు పెట్టారు. పలు మార్గాల్లో మధ్యాహ్నం ట్రాఫిక్ మళ్లీంచనున్నారు.
హైదరాబాద్ నగరంలోని చందానగర్ పీఎస్ పరిధిలో విషాదం నెలకొంది. చందానగర్ పీఎస్ పరిధిలోని తారానగర్లో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఇంట్లో ఆడుకుంటూ పొరపాటున మస్కిటో లిక్విడ్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.
సికింద్రాబాద్లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం కోసం సికింద్రాబాద్ వచ్చిన ప్రధాని.. రాజకీయాలు చేయడం మంచిది కాదని మండిపడ్డారు. కుటుంబ పాలన ఉన్న పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులపై విద్యుత్ భారం పెంచుతామంటే వ్యతిరేకించాం తప్ప, కేంద్రానికి అన్ని విషయాల్లో సహకరించామని ఆయన తెలిపారు.
SSC Papers: తెలంగాణలో ఎస్ఎస్సీ పరీక్షలు ఏప్రిల్ 11తో ముగియనున్నాయి. అనంతరం ఏప్రిల్ 13 నుంచి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.