Telangana Assembly Budget Sessions: నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!
- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం
- ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రసంగం
- ఉదయం 11:45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Budget Sessions: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 16) ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రసంగిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్ చాంబర్ లో బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతుంది ప్రభుత్వం. ఉదయం 11గ:45 నిమిషాలకు ఉభయ సభల సంయుక్త సమావేశం ప్రారంభం కానుంది.
Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన శివప్రతాప్ శుక్ల మొదటిసారి అసెంబ్లీకి రానున్నారు. ఉదయం 11: 25 నిమిషాలకు గవర్నర్ అసెంబ్లీకి చేరుకుంటారు. 11:45 నిమిషాలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభంవుతుంది. 10 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే సభా ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఈ విగ్రహ రూపాన్ని బిఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది.
అసెంబ్లీలో కీలక అంశాలను చర్చించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం తీసుకురాబోతుంది ప్రభుత్వం. గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం కొత్త చట్టానికి మద్దతుపై చర్చించనున్నారు. ఇంకా విద్యారంగంలో కొత్త విధానాల అమలు మార్పులు బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరగనుంది. సోషల్ మీడియా కట్టడి పైన చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే నగరంలోని మూసి నది ప్రక్షాళన నదీ జలాల అంశం, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది.
Ustaad Bhagat Singh: ఈ ఉగాది.. ‘ఉస్తాద్’ ఉగాది.. పవర్ స్టార్ ఒక రియల్ ఇన్స్పిరేషన్: శ్రీలీల
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు, డిజీపి శివధర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనుకోని సంఘటనలు, అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. అసెంబ్లీ కౌన్సిల్ ఇప్పుడు ఒకే ప్రాంగణంలో పనిచేయబోతున్నాయి. దీంతో సెక్యూరిటీ పార్కింగ్ లాంటి విషయాల్లో ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్ చాంబర్ లో బిఏసి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పని దినాలు ఎజెండా పై చర్చించనున్నారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!