Telangana Assembly Budget Sessions: నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!
- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం
- ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రసంగం
- ఉదయం 11:45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Budget Sessions: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 16) ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రసంగిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్ చాంబర్ లో బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతుంది ప్రభుత్వం. ఉదయం 11గ:45 నిమిషాలకు ఉభయ సభల సంయుక్త సమావేశం ప్రారంభం కానుంది.
Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!
Also Read
గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన శివప్రతాప్ శుక్ల మొదటిసారి అసెంబ్లీకి రానున్నారు. ఉదయం 11: 25 నిమిషాలకు గవర్నర్ అసెంబ్లీకి చేరుకుంటారు. 11:45 నిమిషాలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభంవుతుంది. 10 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే సభా ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఈ విగ్రహ రూపాన్ని బిఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది.
అసెంబ్లీలో కీలక అంశాలను చర్చించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం తీసుకురాబోతుంది ప్రభుత్వం. గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం కొత్త చట్టానికి మద్దతుపై చర్చించనున్నారు. ఇంకా విద్యారంగంలో కొత్త విధానాల అమలు మార్పులు బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరగనుంది. సోషల్ మీడియా కట్టడి పైన చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే నగరంలోని మూసి నది ప్రక్షాళన నదీ జలాల అంశం, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది.
Ustaad Bhagat Singh: ఈ ఉగాది.. ‘ఉస్తాద్’ ఉగాది.. పవర్ స్టార్ ఒక రియల్ ఇన్స్పిరేషన్: శ్రీలీల
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు, డిజీపి శివధర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనుకోని సంఘటనలు, అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. అసెంబ్లీ కౌన్సిల్ ఇప్పుడు ఒకే ప్రాంగణంలో పనిచేయబోతున్నాయి. దీంతో సెక్యూరిటీ పార్కింగ్ లాంటి విషయాల్లో ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్ చాంబర్ లో బిఏసి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పని దినాలు ఎజెండా పై చర్చించనున్నారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!