Langar House : భార్యను 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించాడు.. పక్కింటి వాళ్లతో మాట్లాడిందని చంపేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Langar House : భార్యభర్తల బంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఎన్ని మనస్పర్థలు వచ్చినా ఆ నమ్మకం ఇద్దరి బంధాన్ని నిలబెట్టుతుంది. కానీ అనుమానంతో కూడిన బంధం చాలా కాలం నిలవదు. అలాంటి ఘటనే హైదరాబాద్ పరిధిలోని లంగర్ హౌజ్ లో చోటు చేసుకుంది. అతడికి భార్యపై అనుమానం ఉంది. దీంతో ఆమెను ఎవరితో మాట్లాడినివ్వకపోయేవాడు. 20ఏళ్లుగా ఆమెను ఇంట్లోనే బంధిస్తున్నాడు. చిత్ర హింసలు పెడుతున్నాడు. 20 ఏళ్లలో అనేక సార్లు ఇళ్లు మార్చాడు. చివరికి లంగర్ హౌస్ లో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే అక్కడ తన భార్య పక్కింటి వారితో మాట్లాడిందన్న కారణంగా దారుణంగా హతమార్చాడు.
Also Read
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన జహంగీర్.. పంజగుట్ట కు చెందిన కనీజ్ బేగానికి 2004లో వివాహం జరిగింది. వీరి దాంపత్యానికి నిదర్శనంగా నలుగురు పిల్లలు పుట్టారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. జహంగీర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అతడు వివాహమైన కొంత కాలం నుంచే భార్యపై అనుమానం మొదలుపెట్టాడు. ఆమెను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. చివరికి ఆమెను తన తల్లితో కూడా మాట్లాడినివ్వకపోయేవాడు. పని మీద బయటకు వెళ్లినప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి తాళం వేసేవాడు. ఈ క్రమంలో అనేక సార్లు వారి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఇంటి ఓనర్లు అతడిని హెచ్చరించడంతో ఇళ్లు మారిపోయేవాడు. 10 ఏళ్ల కిందట పెద్ద గొడవ జరిగింది. దీంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు ఇద్దరినీ కూర్చోబెట్టి, జహంగీర్ ను తిట్టి… కనీజ్ ను మళ్లీ కాపురానికి పంపించారు.
Read Also:Imran Khan: నన్ను పదేళ్లపాటు జైల్లో ఉంచాలని పాక్ సైన్యం ప్లాన్ చేస్తోంది..
ఇటీవలే జహంగీర్ లంగర్హౌస్ బాగ్దాద్ కాలనీకి ఫ్యామిలీని షిప్ట్ చేశాడు. ఐదు రోజుల కిందట ఎప్పటిలాగే పనికి వెళ్లి తిరిగి వచ్చాడు. చిన్న కూతురిని పిలిచి తల్లి ఈ రోజు ఎవరితో మాట్లాడిందని అడిగాడు. పక్కింటి వాళ్లతో అని బిడ్డ బదులు ఇచ్చింది. దీంతో అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. కనీజ్ ను తీవ్రంగా కొట్టాడు. మనస్థాపం చెందిన ఆమె.. పిల్లలను తీసుకొని తన సోదరుడు ఉంటున్న ఎండీలైన్స్ లోని ఇంటికి వెళ్లింది. కాగా, శనివారం సాయంత్రం బావ మరిది ఇంటికి గఫార్ వెళ్లాడు. ఇప్పటి నుంచి కలిసి మెలిసి ఉందామని నచ్చజెప్పాడు. అనంతరం పిల్లలను తన బావ మరిది ఇంట్లోనే ఉంచి, భార్యను మాత్రమే బాగ్దాద్ కాలనీలో ఉన్న ఇంటికి వచ్చారు. అయితే రాత్రి భోజనం అయిన తరువాత భార్యతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను హత్య చేశాడు. తరువాత లంగర్హౌస్ పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు పంపి… ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!