Langar House : భార్యను 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించాడు.. పక్కింటి వాళ్లతో మాట్లాడిందని చంపేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Langar House : భార్యభర్తల బంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఎన్ని మనస్పర్థలు వచ్చినా ఆ నమ్మకం ఇద్దరి బంధాన్ని నిలబెట్టుతుంది. కానీ అనుమానంతో కూడిన బంధం చాలా కాలం నిలవదు. అలాంటి ఘటనే హైదరాబాద్ పరిధిలోని లంగర్ హౌజ్ లో చోటు చేసుకుంది. అతడికి భార్యపై అనుమానం ఉంది. దీంతో ఆమెను ఎవరితో మాట్లాడినివ్వకపోయేవాడు. 20ఏళ్లుగా ఆమెను ఇంట్లోనే బంధిస్తున్నాడు. చిత్ర హింసలు పెడుతున్నాడు. 20 ఏళ్లలో అనేక సార్లు ఇళ్లు మార్చాడు. చివరికి లంగర్ హౌస్ లో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే అక్కడ తన భార్య పక్కింటి వారితో మాట్లాడిందన్న కారణంగా దారుణంగా హతమార్చాడు.
Also Read
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన జహంగీర్.. పంజగుట్ట కు చెందిన కనీజ్ బేగానికి 2004లో వివాహం జరిగింది. వీరి దాంపత్యానికి నిదర్శనంగా నలుగురు పిల్లలు పుట్టారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. జహంగీర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అతడు వివాహమైన కొంత కాలం నుంచే భార్యపై అనుమానం మొదలుపెట్టాడు. ఆమెను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. చివరికి ఆమెను తన తల్లితో కూడా మాట్లాడినివ్వకపోయేవాడు. పని మీద బయటకు వెళ్లినప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి తాళం వేసేవాడు. ఈ క్రమంలో అనేక సార్లు వారి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఇంటి ఓనర్లు అతడిని హెచ్చరించడంతో ఇళ్లు మారిపోయేవాడు. 10 ఏళ్ల కిందట పెద్ద గొడవ జరిగింది. దీంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు ఇద్దరినీ కూర్చోబెట్టి, జహంగీర్ ను తిట్టి… కనీజ్ ను మళ్లీ కాపురానికి పంపించారు.
Read Also:Imran Khan: నన్ను పదేళ్లపాటు జైల్లో ఉంచాలని పాక్ సైన్యం ప్లాన్ చేస్తోంది..
ఇటీవలే జహంగీర్ లంగర్హౌస్ బాగ్దాద్ కాలనీకి ఫ్యామిలీని షిప్ట్ చేశాడు. ఐదు రోజుల కిందట ఎప్పటిలాగే పనికి వెళ్లి తిరిగి వచ్చాడు. చిన్న కూతురిని పిలిచి తల్లి ఈ రోజు ఎవరితో మాట్లాడిందని అడిగాడు. పక్కింటి వాళ్లతో అని బిడ్డ బదులు ఇచ్చింది. దీంతో అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. కనీజ్ ను తీవ్రంగా కొట్టాడు. మనస్థాపం చెందిన ఆమె.. పిల్లలను తీసుకొని తన సోదరుడు ఉంటున్న ఎండీలైన్స్ లోని ఇంటికి వెళ్లింది. కాగా, శనివారం సాయంత్రం బావ మరిది ఇంటికి గఫార్ వెళ్లాడు. ఇప్పటి నుంచి కలిసి మెలిసి ఉందామని నచ్చజెప్పాడు. అనంతరం పిల్లలను తన బావ మరిది ఇంట్లోనే ఉంచి, భార్యను మాత్రమే బాగ్దాద్ కాలనీలో ఉన్న ఇంటికి వచ్చారు. అయితే రాత్రి భోజనం అయిన తరువాత భార్యతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను హత్య చేశాడు. తరువాత లంగర్హౌస్ పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు పంపి… ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!