మలక్ పేట్ గంజ్ మిషన్ మార్కెట్లో ఒక భవనం టెర్రస్ పై బీహార్ కి చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి మొక్కలను పెంచుతూ శుక్రవారం హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి పట్టుబడ్డారు. మహబూబ్ మిషన్ మార్కెట్ భవనంలో కింద మొత్తం మార్కెట్ షాపులుగా ఉన్నాయి. పైన టెర్రస్ లో బీహార్ కు చెందినటువంటి లవకుశ, బీమ్లేష్ అనే ఇద్దరు అద్దెకు ఉంటున్నారు. టెర్రస్ పై గత ఆరు నెలలుగా గంజాయి మొక్కలను పెంచుతూ వాటిని ఏపుగా పెరిగిన అనంతరం…
సోమాజిగూడ లోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ కిచెన్ నుండి దట్టంగా పొగలు వెలువడ్డాయి. బిల్డింగ్ అయిదవ అంతస్తులో రెస్టారెంట్ ఉంది. భవనం నాలుగో అంతస్తులో GRT జ్యూవెలర్స్ ఉంది. అయిదవ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ నుండి పొగలు వెలువడ్డాయి. దీంతో అంతా భయాందోళనకు గురయ్యారు. ఉద్యోగులు, ఇతర పనులకు వెళ్లిన వారు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో అగ్నిప్రమాదం ఆందోళన కలిగించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి ఫైర్,…
హయత్నగర్లో మగవాళ్లను టార్గెట్ చేస్తూ వారిని మోసం చేస్తున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినెస్ పేరుతో దగ్గర కావడం, సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు రహస్యంగా రికార్డ్ చేయడం, తరువాత ఆ వీడియోలను చూపించి డబ్బులు దోచుకోవడం.. ఇలాంటి నేర పద్ధతితో ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా ప్రాంతానికి చెందిన ఈ మహిళ రెండవ వివాహం ఒక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్తో జరిగినట్లు…
భట్టి మాట్లాడుతూ.. క్వాంటం టెక్నాలజీ గురించి దేశం చర్చిస్తుంది.. దాని ఆవిష్కరణకి తెలంగాణను ఎంచుకున్నందుకు నీతి ఆయోగ్ కి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. డిజిటల్, టాలెంట్ కి హైదరాబాద్ కి కేంద్రంగా మారింది అన్నారు.
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 27 మున్సిపాలిటీల విలీనం ప్రక్రియ వేగవంతం అయింది. ఇప్పటికే ప్రభుత్వం పంపిన ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
HMDA Land Auction: కోకాపేట నియో పోలీస్ భూములకు మూడో విడత వేలం ముగిసింది. ఈరోజు (డిసెంబర్ 3న) ప్లాట్ నంబర్స్ 19, 20లోని 8.04 ఎకరాలకు ఈ వేలం వేశారు అధికారులు.
IndiGo Flights Delay: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన కొన్ని విమానాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీని కారణంగా పలు ఫ్లైట్లు ఆలస్యం అవ్వగా, కొన్ని విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది.
Loan Fraud: హౌసింగ్ లోన్ మోసం కేసులో ఓ దంపతులకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది నాంపల్లి కోర్టు. నకిలీ పత్రాలతో లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన దంపతులు దసరథ్ నేత, లక్ష్మీబాయిగా గుర్తించారు.
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న పిల్లలపై కుక్క కాట్ల ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం నాడు హయత్నగర్లో ప్రేమ్చంద్ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.