2009 ఎన్నికల్లో 171 ఓట్లతో గెలిచిన కేటీఆర్.. 1700 ఓట్లతో గెలిచని నన్ను ఎక్కిరిస్తుండని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, మంత్రి హరీష్ రావులపై ధ్వజమెత్తారు. తండ్రి, కొడుకు, అల్లుడు వరుస పట్టి దుబ్బాక వస్తున్నారు.. ఏం చేశారు? అని ప్రశ్నించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పోల్చి దుబ్బాకుకు ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం ఇస్తారా? కేసీఆర్ అంటేనే అబద్ధం, కేసీఆర్ అంటేనే మోసమన్నారు.…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా - అల్లుళ్లకు లేదని ఆయన విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్.. రెండు రోజుల క్రితం రైతు బంధు నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఉన్నట్టుండి రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది..
ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ‘బీఆర్ఎస్ సభలల్లో జన సునామీ కనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ల మీటింగ్లకు మాత్రం జనాలు రావడం లేదు. 80 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు అన్నదాతలకు కష్టాలు. రేవంత్ 3 గంటలు కరంట్ చాలు అంటున్నాడు. కర్ణాటక DY సీఎం శివ కుమార్ 5 గంటలు కరంట్ ఇస్తాం అని కుండ బద్దలు కొట్టాడు. Also Read: Teen…
సిద్దిపేట జిల్లా చేర్యాలలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా ఆయన కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ మీటింగ్ లకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. అదే.. బీఆర్ఎస్ మీటింగ్ లకి ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు మార్పు కావాలి అంటున్నారు.. మార్పు అంటే 24 గంటల కరెంట్ కాకుండా మూడు గంటల కరెంటా అని విమర్శించారు.
పాలకుర్తిలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అందరి నోట్లో నాలుకల ఉన్న దయన్న గెలవాలా... నోట్ల కట్టలతో వచ్చిన ఎన్ఆర్ఐ గెలవాలా అని ప్రశ్నించారు. ఇంటింటికి దయన్న మంచి నీళ్లు ఇచ్చారని తెలిపారు. నోట్ల కట్టలకి అమ్ముడు పోయే గడ్డ కాదు ఈ పాలకుర్తి గడ్డ అని అన్నారు.
Harish Rao: కాంగ్రెస్ నేతల మాటలు, కాంగ్రెస్ హమీలపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. సంగారెడ్డిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. మూడు గంటలు కరెంట్ చాలన్న ఆయన నిన్న నారాయణఖేడ్ వచ్చాడని, పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇస్తామని, ఆ రాష్ట్ర ఓటర్లను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రైతులకు ఉన్న గోచి ఊడిపోయిందని అన్నారు.
Harish Rao Counters to Nirmala Sitharaman Comments: బీజేపీ నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడిందని బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు అన్నారు. పంట పొలాల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వంను ఒత్తిడి చేసిందని, మీటర్లు పెట్టలేదనే తెలంగాణ రాష్ట్రంకు ఇచ్చే డబ్బులు ఇవ్వలేదని అనడం ద్వారా బీజేపీ బండారాన్ని నిర్మలమ్మ స్వయంగా బయటపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ది రైతు పక్షపాత ప్రభుత్వమనే విషయం కేంద్రమంత్రి వ్యాఖ్యలతో…
Harish Rao Said Congress Party Copy Ramakka Song: బీఆర్ఎస్ మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేనిఫెస్టోని మాత్రమే కాదని.. రామక్క పాటని (గులాబీల జండలే) కూడా కాంగ్రెస్ సహా బీజేపీ కూడా కాపీ కొట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే సీఎంలు అనుకుంటున్నారని, సుతి లేని కాంగ్రెస్ చేతిలో తెలంగాణ రాష్ట్రం పడితే ఆగం అవుతాం అని హరీశ్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు 2023 ప్రచారంలో…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుండ బద్దలు కొట్టినట్లు అసలు విషయం చెప్పారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లే నిధులు ఇవ్వలేదని చెప్పారు..