India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు కొత్త కాంబినేషన్!
- మరికొద్ది గంటల్లో భారత్–న్యూజిలాండ్ ఫైనల్
- భారత్ ప్లేయింగ్ ఎలెవన్లో కీలక మార్పు
- టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు కొత్త కాంబినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing XI vs NZ for T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది గంటల్లో భారత్–న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం అయ్యే ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది భారత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి పొట్టి కప్ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఫైనల్కు ముందు భారత్ ప్లేయింగ్ ఎలెవన్పై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. కీలక మ్యాచ్ను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పులో ఓ మార్పు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వరుణ్ చక్రవర్తి అవుట్:
భారత జట్టు స్పిన్ విభాగంలో మార్పు జరిగే అవకాశం ఉందని సమాచారం. న్యూజిలాండ్తో జరగనున్న ఫైనల్ మ్యాచ్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆడడం లేదని తెలుస్తోంది. అతడి స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోందట. గత కొన్ని మ్యాచ్లలో వరుణ్ ఎక్కువ పరుగులు ఇచ్చిన నేపథ్యంలో ఈ మార్పు చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులిచ్చాడు. అంతకుముందు కూడా భారీగా రన్స్ సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వరుణ్ను పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలని కెప్టెన్, కోచ్ చూస్తున్నారట. మెగా టోర్నీలో పాకిస్థాన్పై మాత్రమే కుల్దీప్ ఆడిన విషయం తెలిసిందే.
Also Read
- Vaibhav Sooryavanshi: అమ్మా... నీ కోసమే ఈ ఫిఫ్టీ.. వైభవ్ సూర్యవంశీ భావోద్వేగ ప్రకటన..
- Shreyas Iyer Trolls: గెలిచినా శ్రేయస్పై విమర్శలు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై ప్రశ్నలు!
- Asian Games 2026 Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఒక్కటే ఛాన్స్!
- Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అభిషేక్ శర్మకు మరో అవకాశం:
టీ20 వరల్డ్ కప్ 2026లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అయినా ఫైనల్ మ్యాచ్లో అతడికి మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జట్టు మేనేజ్మెంట్ అతనిపై విశ్వాసం ఉంచి కీలక మ్యాచ్లో కూడా ప్లేయింగ్ ఎలెవన్లో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈసారన్నా మేనేజ్మెంట్ నమ్మకాన్ని అభిషేక్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో రింకు సింగ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్లు ఆడే అవకాశం లేదు. ఈ ముగ్గురు ఆటగాళ్లు బెంచ్పైనే ఉండనున్నారు. న్యూజిలాండ్తో జరిగే ఈ కీలక ఫైనల్ మ్యాచ్కు టీమిండియా అత్యంత సమతుల్య జట్టుతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.
భారత్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అమ్మా… నీ కోసమే ఈ ఫిఫ్టీ.. వైభవ్ సూర్యవంశీ భావోద్వేగ ప్రకటన..
-
Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
-
Gujarat Floods: గుజరాత్ను ముంచెత్తిన వరదలు.. నీళ్లల్లోనే పలు నగరాలు
-
Bitchat: సీజేపీ నిరసనల్లో ఉపయోగించిన ‘‘బిట్చాట్’’ యాప్పై కేంద్రం చర్యలు..
-
Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!