Revanth Reddy: హరీష్ రావు వ్యాఖ్యల వల్లే రైతు బంధు ఆగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రైతు బంధు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన పర్మిషన్ ను క్యాన్సిల్ చేసింది. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా – అల్లుళ్లకు లేదని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఎన్నికల కమిసన్ ఉపసంహరించుకుంటున్నట్టు ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనం అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు.. పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 వేల రూపాయల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: MLC Kavitha: రైతు బంధు ఆపింది కాంగ్రెస్సే.. రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారు
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
అయితే, రైతుబంధు పంపిణీకి ఎన్నికల కమిసన్ (ఈసీ) ఇచ్చిన అనుమతిని కేసీఆర్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు. ఏదో ప్రయోజనం కోరి చివరి వరకూ రైతు బంధును పంపిణీ చేయకుండా నిలిపి వేస్తే.. ఈలోగా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసుకుంది. ఈ నెల 24 నుంచి రైతుబంధు అనుమతికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. అయితే, సీఈసీ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం ఉలంగించినందుకు అనుమతి రద్దు చేసింది.. ఈసీ అనుమతి ఇచ్చిన తర్వాత మంత్రి హరీష్ రావు ఓ సభలో మాట్లాడుతూ.. మంగళవారం నాడు ఉదయం రైతులు చాయ్ తాగే సమయానికి మీ ఫోన్లలో టింగ్ టింగ్ టింగ్ టింగ్ అంటూ రైతు బంధు పడ్డ మెస్సేజ్ లు వస్తాయని కామెంట్స్ చేశారు.. వీటికి పరిగణలోకి తీసుకున్న ఈసీ రైతు బంధు పర్మిషన్ ను రద్దు చేసింది.
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా – అల్లుళ్లకు లేదు.
హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.
ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు… pic.twitter.com/H56vhAiNlk
— Revanth Reddy (@revanth_anumula) November 27, 2023
తాజావార్తలు
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!