Revanth Reddy: హరీష్ రావు వ్యాఖ్యల వల్లే రైతు బంధు ఆగింది..
తెలంగాణలో రైతు బంధు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన పర్మిషన్ ను క్యాన్సిల్ చేసింది. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా – అల్లుళ్లకు లేదని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఎన్నికల కమిసన్ ఉపసంహరించుకుంటున్నట్టు ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనం అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు.. పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 వేల రూపాయల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: MLC Kavitha: రైతు బంధు ఆపింది కాంగ్రెస్సే.. రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారు
Also Read
అయితే, రైతుబంధు పంపిణీకి ఎన్నికల కమిసన్ (ఈసీ) ఇచ్చిన అనుమతిని కేసీఆర్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు. ఏదో ప్రయోజనం కోరి చివరి వరకూ రైతు బంధును పంపిణీ చేయకుండా నిలిపి వేస్తే.. ఈలోగా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసుకుంది. ఈ నెల 24 నుంచి రైతుబంధు అనుమతికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. అయితే, సీఈసీ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం ఉలంగించినందుకు అనుమతి రద్దు చేసింది.. ఈసీ అనుమతి ఇచ్చిన తర్వాత మంత్రి హరీష్ రావు ఓ సభలో మాట్లాడుతూ.. మంగళవారం నాడు ఉదయం రైతులు చాయ్ తాగే సమయానికి మీ ఫోన్లలో టింగ్ టింగ్ టింగ్ టింగ్ అంటూ రైతు బంధు పడ్డ మెస్సేజ్ లు వస్తాయని కామెంట్స్ చేశారు.. వీటికి పరిగణలోకి తీసుకున్న ఈసీ రైతు బంధు పర్మిషన్ ను రద్దు చేసింది.
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా – అల్లుళ్లకు లేదు.
హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.
ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు… pic.twitter.com/H56vhAiNlk
— Revanth Reddy (@revanth_anumula) November 27, 2023
తాజావార్తలు
-
Chegg Downfall: ఒకప్పుడు ఎడ్టెక్ రారాజు.. నేడు దివాళా దిశగా! ఏఐ దెబ్బకు 15 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం క్లోజ్
-
Electric Scooters: హీరో, టీవీఎస్, లేదా ఏథర్.. దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?
-
IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ల బదిలీ
-
APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
-
Paytm Payments Bank: బిగ్షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!