హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య కాకరేపుతున్నాయి.. ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుండగా.. హుజురాబాద్ బై పోల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాయితీగా పోరాడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యాంగ మాట్లాడుతూ , ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, సంతలో కూరగాయలు…
మంత్రి హరీష్రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హరీష్ అన్న బాగా ఎగురుతున్నావట ఆరు నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారు అని వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. అప్పుడు హరీష్ అన్నని గెలిపించాలని మళ్లీ మన యువకులు తిరగాల్సి వస్తది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈటల రాజేందర్ ను రాత్రికి రాత్రి…
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయవేడిని రగిలించింది. ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఉప ఎన్నిక మారింది. దీంతో ఇక్కడ గెలుపు ఇరువురికి ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఛాలెంజ్ గా తీసుకొని హుజూరాబాద్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల అభ్యర్థులకు మాత్రం ఎన్నికల గుర్తులు(సింబల్స్) టెన్షన్ కు గురిచేస్తున్నాయట… హుజూరాబాద్…
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లోని రాచపల్లి గ్రామంలో టీఆరెస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అసలు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయ్ ఒక్కసారి ఆలోచించాలి. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసాడు చెప్పాలి అన్నారు. మీకు పని చేసే వాళ్ళను గెలిపించండి. ఈటల లేనిపోని మాటలు…
కమలాపూర్ మండలం లోని శ్రీరాములపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ మాట్లాడితే ఒకనాడు తెలంగాణ పులకించింది. అడుగులో అడుగు వేసింది. ఈ రోజు ఎవరు ఎక్కువ ఆయన్ను తిడితే అంత ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. అంటే అయన పెరిగినట్ట, తరిగినట్టా? అయన చరిత్ర హీనం అవుతుంది. కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండి కత్తి అందిస్తే హరీష్ వచ్చి పొడుస్తుండు. కాళోజీ చెప్పినట్టు ప్రాంతం…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు బీజేపీ నాయకులు కార్యకర్తలు. అక్కడ గంగుల కమలాకర్ మాట్లాడుతూ… రాష్ట్రం లో ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ కే ఉంది. బీజేపీ పార్టీ లో పని చేసే వాళ్ళను బయటికి వెళ్లగొట్టరు. విశ్వసనీయతకు వెన్నుపోటు కు మధ్యల జరిగే ఎన్నికలు ఇవి అన్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ రోజురోజకీ హుజూరాబాద్ లో ఆదరణ…
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం బత్తినివాని పల్లిలో మంత్రి నేడు ఈటల ఎన్నికల ప్రచారం చేసారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ఓట్ల కోసం ఏది అడిగితే అది ఇస్తారట. నామీద దాడి చేసేందుకు పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ల నియోజకవర్గాలను పట్టించుకుని ఎమ్మెల్యేలు ఇక్కడ మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారు. కూట్లే తీయలేనోడు.. ఏట్లో రాయి తీసినట్లుగా ఇక్కడ హామీలిస్తున్నారు. దళితబంధు సహా.. అనేక హామీలు ఇస్తున్నారంటే అవన్నీ మీపై ప్రేమతో…
దేశ చరిత్రలో హుజురాబాద్ ఎపిసోడ్ చీకటి అధ్యాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా నియోజకవర్గ ఎపిసోడ్ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా అభివర్ణించారు. అడ్డదారుల్లో ప్రలోభాలతో మద్యం, డబ్బుతో గెలవాలని టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని ఆరోపించిన ఈటల రాజేందర్.. నాయకులకు, ప్రజా ప్రతినిధులకు కొనుగోలు చేసే దారుణం జరుగుతోందని ఆవేదన వ్యక్తం…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మరోసారి నామినేషన్ దాఖలు చేసారు. ఆ గెల్లు శ్రీనివాస్ వెంట నామినేషన్ కేంద్రానికి మంత్రి హరీష్ రావు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి బలు మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయగా అతని వెంట నామినేషన్ కు కేంద్రానికి వచ్చారు కాంగ్రెస్ నాయకులు…
హుజురాబాద్లో ఉప ఎన్నికల వాతావరణం హీటెక్కిస్తోంది… ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా… మరో రెండు ప్రధాన పార్టీలు కూడా రంగంలోకి దిగాయి… బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరి వెంకట్ రేపే నామినేషన్ దాఖలు చేయనున్నారు.. రేపు ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు,…