టీఆర్ఎస్, బీజేపీలను హడలెత్తిస్తున్న సింబల్స్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయవేడిని రగిలించింది. ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఉప ఎన్నిక మారింది. దీంతో ఇక్కడ గెలుపు ఇరువురికి ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఛాలెంజ్ గా తీసుకొని హుజూరాబాద్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల అభ్యర్థులకు మాత్రం ఎన్నికల గుర్తులు(సింబల్స్) టెన్షన్ కు గురిచేస్తున్నాయట…
హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్న పలువురు స్వత్రంత అభ్యర్థులు టీఆర్ఎస్, బీజేపీలను ఇరుకునపెట్టేలా గుర్తులను ఎంచుకోవడం గమనార్హం. టీఆర్ఎస్ గుర్తు అయిన కారు, బీజేపీ గుర్తు అయిన కమలంను పోలిన పలు గుర్తులను స్వతంత్రులు ఎంచుకోవడంతో ఆపార్టీల అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ప్రధాన పోటీదారులుగా ఉన్న అభ్యర్థుల పేరుతో ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెల్సిందే. దీనికితోడు పార్టీ సింబల్స్ కూడా ఒకేరకంగా ఉండేలా చూసుకుంటుండటంతో ఓట్లు చీలే అవకాశం భారీగా కన్పిస్తోంది.
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఈ పరిణమాలన్నీ కూడా గెలుపుపై ధీమాగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను పలుచోట్ల ఓటమిపాలు చేశాయి. కారు సింబల్ ను పోలిన ట్రక్కు, రోడ్డు రోలర్, ట్రాక్టర్, చపాతి రోలర్, ఆటో రిక్షా, ఇస్త్రీ పెట్టె, బస్సు, లారీ గుర్తులు టీఆర్ఎస్ ఓట్లను గత ఎన్నికల్లో భారీగా చీల్చాయి. ఈక్రమంలోనే ఈ గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
టీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు ట్రక్కు, రోడ్ రోలర్, ఆటో సింబల్స్ ను కేంద్ర ఎన్నికల సంఘం తొలగిచింది. అయితే కారును పోలిన చపాతి రోలర్, ట్రాక్టర్, ఇస్త్రీపెట్టె, బస్సు, లారీ గుర్తులను అందుబాటులో ఉంచింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు కావాలనే ఈ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా బీజేపీ కమలం గుర్తును పోలిన కాలీఫ్లవర్, పైనాపిల్ గుర్తులను ఈటల రాజేందర్ పేరుకు దగ్గరగా ఉన్న ఇ. రాజేందర్ అనే వ్యక్తులు ఎంచుకోవడం ఆసక్తిని రేపుతోంది.
బీజేపీ, టీఆర్ఎస్ లకు చెందిన గుర్తులను పోలిన వాటిని ఎన్నికల సంఘం ఆమోదిస్తే ఇరుపార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే టాక్ విన్పిస్తుంది. అయితే ప్రత్యర్థిని ఓడించే వ్యూహాంలో భాగంగానే ప్రధాన పార్టీలే సింబల్స్ వార్ కు తెరలేపాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక నేడు నామినేషన్ల పరిశీలన జరగనుండగా 13వరకు ఉపసంహరణ గడువు ఉంది. దీంతో వీటిపై ఆలోగా మరింత క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తుంది. మొత్తంగా స్వత్రంత్య అభ్యర్థులు ఎంచుకున్న గుర్తులు మాత్రం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గుబులును రేపుతోంది.
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!