టీఆర్ఎస్, బీజేపీలను హడలెత్తిస్తున్న సింబల్స్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయవేడిని రగిలించింది. ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఉప ఎన్నిక మారింది. దీంతో ఇక్కడ గెలుపు ఇరువురికి ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఛాలెంజ్ గా తీసుకొని హుజూరాబాద్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల అభ్యర్థులకు మాత్రం ఎన్నికల గుర్తులు(సింబల్స్) టెన్షన్ కు గురిచేస్తున్నాయట…
హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్న పలువురు స్వత్రంత అభ్యర్థులు టీఆర్ఎస్, బీజేపీలను ఇరుకునపెట్టేలా గుర్తులను ఎంచుకోవడం గమనార్హం. టీఆర్ఎస్ గుర్తు అయిన కారు, బీజేపీ గుర్తు అయిన కమలంను పోలిన పలు గుర్తులను స్వతంత్రులు ఎంచుకోవడంతో ఆపార్టీల అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ప్రధాన పోటీదారులుగా ఉన్న అభ్యర్థుల పేరుతో ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెల్సిందే. దీనికితోడు పార్టీ సింబల్స్ కూడా ఒకేరకంగా ఉండేలా చూసుకుంటుండటంతో ఓట్లు చీలే అవకాశం భారీగా కన్పిస్తోంది.
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ఈ పరిణమాలన్నీ కూడా గెలుపుపై ధీమాగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను పలుచోట్ల ఓటమిపాలు చేశాయి. కారు సింబల్ ను పోలిన ట్రక్కు, రోడ్డు రోలర్, ట్రాక్టర్, చపాతి రోలర్, ఆటో రిక్షా, ఇస్త్రీ పెట్టె, బస్సు, లారీ గుర్తులు టీఆర్ఎస్ ఓట్లను గత ఎన్నికల్లో భారీగా చీల్చాయి. ఈక్రమంలోనే ఈ గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
టీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు ట్రక్కు, రోడ్ రోలర్, ఆటో సింబల్స్ ను కేంద్ర ఎన్నికల సంఘం తొలగిచింది. అయితే కారును పోలిన చపాతి రోలర్, ట్రాక్టర్, ఇస్త్రీపెట్టె, బస్సు, లారీ గుర్తులను అందుబాటులో ఉంచింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు కావాలనే ఈ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా బీజేపీ కమలం గుర్తును పోలిన కాలీఫ్లవర్, పైనాపిల్ గుర్తులను ఈటల రాజేందర్ పేరుకు దగ్గరగా ఉన్న ఇ. రాజేందర్ అనే వ్యక్తులు ఎంచుకోవడం ఆసక్తిని రేపుతోంది.
బీజేపీ, టీఆర్ఎస్ లకు చెందిన గుర్తులను పోలిన వాటిని ఎన్నికల సంఘం ఆమోదిస్తే ఇరుపార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే టాక్ విన్పిస్తుంది. అయితే ప్రత్యర్థిని ఓడించే వ్యూహాంలో భాగంగానే ప్రధాన పార్టీలే సింబల్స్ వార్ కు తెరలేపాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక నేడు నామినేషన్ల పరిశీలన జరగనుండగా 13వరకు ఉపసంహరణ గడువు ఉంది. దీంతో వీటిపై ఆలోగా మరింత క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తుంది. మొత్తంగా స్వత్రంత్య అభ్యర్థులు ఎంచుకున్న గుర్తులు మాత్రం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గుబులును రేపుతోంది.
తాజావార్తలు
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!