Election Commission: జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగబోతుంది. భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం3.30 గంటలకు ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల షెడ్యూల్ను తెలిపనుంది.
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి హస్తం పార్టీ నేతలు నిరాశ, నిస్పృహలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జిమ్మిక్కులు చేసి హర్యానాలో గెలిచిందని కాంగ్రెస్ ఆరోపించింది.
Jammu Kashmir Elections: మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అన్నింటి కన్నా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడుతల్లో అంటే సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 01 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మిగతా రాష్ట్రాలతో కలిసి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూడా అక్టోబర్ 04న విడుదల కానున్నాయి.
జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో వచ్చే వారం ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్లో పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఆగస్ట్ 8-10 వరకు ఈ పర్యటన జరగనుంది.
ఎలక్షన్ కమిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు)పై భారత ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలను లేవనెత్తుతూనే ఉన్నారు. అయితే.. అమెరికా వంటి అగ్రదేశాలు భారత్ ఎన్నికల ప్రక్రియను కొనియాడుతూనే ఉన్నారు. లోక్ సభ ఎన్నికల అనంతరం వైట్ హౌజ్ కి చెందిన ఓ నాయకుడు ఇండియా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తించేసిందని.. ఈసీకి అభినందనలు తెలిపారు.
ఆరు వారాల పాటు కొనసాగిన లోక్సభ ఎన్నికల పోలింగ్.. శనివారం ముగిసింది. కాగా.. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుగుణంగా ఉన్నాయి. మూడోసారి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే రేపు (మంగళవారం) నేతల భవితవ్యం బయటపడనుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తన వాదనలను నిరూపించేందుకు ఈసీని వారం రోజుల సమయం కావాలని కోరారు. దానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. జూన్ 4న జరగనున్న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు 150 మంది జిల్లా మేజిస్ట్రేట్లు, కలెక్టర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని జైరాం రమేష్ ఆరోపించారు. ఈ క్రమంలో ఈసీ.. వాస్తవ వివరాలను బయటపెట్టాలని కోరింది. ఆదివారం సాయంత్రం లోగా వివరాలు తెలియజేయాలని తెలిపింది. కాగా.. అందుకు వారం రోజుల గడువు…
Telangana Lok Sabha Elections 2024 Results: తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో ఏడు నియోజక వర్గాలు ఉన్నాయి. జిల్లాల వారీగా లెక్కింపు కేంద్రాలను మూడు చోట్ల…