Election Campaign: నేటితో ముగియనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం
- నేటితో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ముగియనున్న ఎన్నికల ప్రచారం..
- రెండు రాష్ట్రాల్లో ఈ నెల 20వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు..
- ఓటర్లను ఆకట్టుకోవటానికి చివరి ప్రయత్నం చేస్తున్న ఎన్డీయే, ఇండియా కూటములు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Campaign: నేటితో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 20వ తేదీన ఒకే విడతలో మహారాష్ట్రలోని 288 స్థానాలకు.. జార్ఖండ్ లో సెకండ్ విడత పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ లో తొలి విడత ఎన్నికల్లో రెండు కూటములు తమకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో జమిలి ఎన్నికల కోసం సన్నాహాలు కొనసాగుతున్న వేళ.. ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపును ఇండియా, ఎన్డీయే కూటములకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే, ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది.
Read Also: Viral News: వీడియో గేమ్లో ఓడిపోవడంతో.. తన 8 నెలల కొడుకును గోడకు విసిరేసిన తండ్రి
Also Read
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
కాగా, జార్ఖండ్ లో 38 స్థానాలకు, మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొత్త నినాదాలతో ఇండియా, ఎన్డీయే కూటమి పార్టీలు ముందుకెళ్తున్నారు. ప్రచారానికి నేడు చివరి రోజు కావటంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టారు. స్థానిక అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవటానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also: Allu Arjun : పుష్ప -2 ట్రైలర్ పై రాజమౌళి రియాక్షన్.. దటీజ్ బన్నీ
అయితే, మహారాష్ట్రలో రెండు (ఇండియా, ఎన్డీయే) కూటముల మధ్య పోరు జోరు కొనసాగుతుంది. ముంబైలోనూ ఈ సారి గట్టి పోటీ కనబడుతుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 234 జనరల్, 25 ఎస్టీ, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఇక, 1.85 కోట్ల మంది యువ ఓటర్లు ఈ సారి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా నిలవబోతున్నారు. వారిలో 20.93 లక్షల మంది తొలిసారి ఓటు వేస్తున్నారు. మహాయుతి, ఎంవీఏ కూటములు తమ మేనిఫెస్టోల్లో ప్రధానంగా యువత, మహిళ ఓట్ల కోసం ఎక్కువ హామీలను ప్రకటించారు. అలాగే, ఈ సారి మహారాష్ట్రలో సామాజిక సమీకరణాలు గెలుపు ఓటములను డిసైడ్ చేయబోతుంది.
తాజావార్తలు
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?