Jharkhand Polls: జార్ఖండ్లో ముగిసిన తొలి విడత ఓటింగ్.. పోలింగ్ శాతమెంతంటే..!
- జార్ఖండ్లో ముగిసిన తొలి విడత ఓటింగ్
- ధోనీని చూసేందుకు ఎగబడ్డ ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. నవంబర్ 13న ఫేజ్-1 ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. బుధవారం 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహం పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఓట్లు వేశారు. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే ప్రజలు భారీగా ఓటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అన్ని పోలింగ్ బూతుల్లో పెద్ద ఎత్తున క్యూలైన్లు దర్శనమిచ్చాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి.
ఇది కూడా చదవండి: The Rana Daggubati Show : సెలబ్రిటీల జీవితాల్లోని ఎవరికీ తెలియని కోణాలు వెలికి తీసేందుకు ది రానా దగ్గుబాటి షో!
Also Read
తొలి విడతలో మాజీ టీమిండియా కెప్టెన్ ఎంఎస్.ధోనీ దంపతులు ఓటింగ్లో పాల్గొన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ పోలింగ్ బూతులో ఓటు వేశారు. ధోనీ.. తన భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. అయితే ధోనీని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఎగబడ్డారు. దీంతో భారీ బందోబస్తు మధ్య ధోనీ దంపతులకు రక్షణ కల్పించారు. మరోవైపు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులు కూడా తొలి విడత పోలింగ్లో భాగంగా ఓటు వేశారు.
ఇది కూడా చదవండి: Bulldozer Action: ‘‘బుల్డోజర్ ఇప్పుడు గ్యారేజీకి వెళ్తుంది’’.. సీఎం యోగిపై అఖిలేష్ విమర్శలు..
బుధవారం జార్ఖండ్తో పాటు వయనాడ్ లోక్సభతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరిగాయి. జార్ఖండ్లో రెండు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. బుధవారం తొలి విడత ముగియగా.. సెకండ్ విడత నవంబర్ 20న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
#WATCH | Former Indian cricket team captain MS Dhoni along with his wife, Sakshi arrives at a polling booth in Ranchi to cast his vote for #JharkhandAssemblyElections2024 pic.twitter.com/KlD68mXdzM
— ANI (@ANI) November 13, 2024
#WATCH | Former Indian cricket team captain MS Dhoni casts his vote at a polling booth in Ranchi for #JharkhandAssemblyElections2024 pic.twitter.com/tNIkwoXIiy
— ANI (@ANI) November 13, 2024
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!