EC: ఈవీఎంల ట్యాంపిరింగ్పై ఎన్నికల సంఘం క్లారిటీ.. సీఈసీ ఏమన్నారంటే..!
- ఈవీఎంల ట్యాంపిరింగ్పై ఎన్నికల సంఘం క్లారిటీ
- ఈవీఎంలను రిగ్గింగ్ చేయడం అసాధ్యం అన్న రాజీవ్ కుమార్
- ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే వారు స్వీయ నియంత్రణ పాటించాలని సూచన
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. హర్యానా ఫలితాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సీఈసీ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈవీఎంలను రిగ్గింగ్ చేయడం అసాధ్యం అని రాజీవ్ కుమార్ కొట్టిపారేశారు. ఇక ఎగ్జిట్ పోల్స్తో ఈసీకి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. అయినా కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే వారు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయా సంస్థలకు ఎన్నికల సంఘం సూచించింది.
ఇది కూడా చదవండి: Citadel: Honey Bunny Trailer: సమంత సిటాడెల్ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా?
Also Read
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగుతోంది. జార్ఖండ్లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 13, 20న ఓటింగ్ జరుగుతోంది. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
ఇటీవలే హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎన్నికలు ముగిశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూశాయి. హస్తం పార్టీదే అధికారం అంటూ ఆయా సంస్థలు ఊదరగొట్టాయి. తీరా.. ఫలితాలు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ముచ్చటగా మూడోసారి హర్యానాలో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ఇక జమ్మూకాశ్మీర్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా ఫలితాలు రాకపోయే సరికి.. కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఎన్నికల సంఘం మాత్రం కొట్టిపారేసింది.
ఇది కూడా చదవండి: Kishan Reddy : దేశ రక్షణ విషయంలో బీఆర్ఎస్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోంది


తాజావార్తలు
-
EPIC Teaser : ఆసక్తి పెంచేలా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!