EC: ఈవీఎంల ట్యాంపిరింగ్పై ఎన్నికల సంఘం క్లారిటీ.. సీఈసీ ఏమన్నారంటే..!
- ఈవీఎంల ట్యాంపిరింగ్పై ఎన్నికల సంఘం క్లారిటీ
- ఈవీఎంలను రిగ్గింగ్ చేయడం అసాధ్యం అన్న రాజీవ్ కుమార్
- ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే వారు స్వీయ నియంత్రణ పాటించాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. హర్యానా ఫలితాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సీఈసీ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈవీఎంలను రిగ్గింగ్ చేయడం అసాధ్యం అని రాజీవ్ కుమార్ కొట్టిపారేశారు. ఇక ఎగ్జిట్ పోల్స్తో ఈసీకి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. అయినా కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే వారు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయా సంస్థలకు ఎన్నికల సంఘం సూచించింది.
ఇది కూడా చదవండి: Citadel: Honey Bunny Trailer: సమంత సిటాడెల్ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా?
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగుతోంది. జార్ఖండ్లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 13, 20న ఓటింగ్ జరుగుతోంది. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
ఇటీవలే హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎన్నికలు ముగిశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూశాయి. హస్తం పార్టీదే అధికారం అంటూ ఆయా సంస్థలు ఊదరగొట్టాయి. తీరా.. ఫలితాలు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ముచ్చటగా మూడోసారి హర్యానాలో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ఇక జమ్మూకాశ్మీర్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా ఫలితాలు రాకపోయే సరికి.. కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఎన్నికల సంఘం మాత్రం కొట్టిపారేసింది.
ఇది కూడా చదవండి: Kishan Reddy : దేశ రక్షణ విషయంలో బీఆర్ఎస్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోంది


తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!