Congress: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
- హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
- ఈవీఎంలలో పరిశీలనకు సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి హస్తం పార్టీ నేతలు నిరాశ, నిస్పృహలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జిమ్మిక్కులు చేసి హర్యానాలో గెలిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. అంతేకాకుండా బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. విచారణ జరపాలని కోరింది. తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపుపై పార్టీ అభ్యర్థుల ఫిర్యాదులు, ఈవీఎంలలో వ్యత్యాసాలను పరిశీలించేందుకు సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
విచారణ పూర్తయ్యే వరకు ఈవీఎంలకు సీలు వేసి భద్రపరచాలని పార్టీ నేతలు ఈసీని కోరారు. మాజీ ముఖ్యమంత్రులు భూపిందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, అలాగే ఏఐసీసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, అజయ్ మాకెన్, పవన్ ఖేరాలతో కూడిన సీనియర్ నేతల బృందం, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఇది కూడా చదవండి: Ratan Tata family tree: రతన్ టాటా ‘‘వంశ వృక్షం’’ ఇదే.. ఎవరికి టాటా గ్రూప్ దక్కుతుంది..?
అక్టోబర్ 8న హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్లింది. సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ అంతలోనే ఫలితాలు తారుమారు అయ్యాయి. బీజేపీ లీడ్లోకి వచ్చి విజయం దిశగా దూసుకెళ్లింది. ఫలితాలు ఒక్కసారిగా తలకిందులవ్వడంతో కాంగ్రెస్ షాక్కు గురైంది. 48 స్థానాలతో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఫలితాలను బలవంతంగా లాక్కుందని.. దీన్ని అంగీకరించబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Bangalore: దుకాణదారుడి భార్య ఖాతాలోకి హఠాత్తుగా రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది?
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!