Maharashtra Elections 2024: ముస్లిం సంస్థల ‘‘ఓట్ జిహాద్’’.. చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన బీజేపీ..
- ముస్లిం సంస్థలు కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ఓట్లు కోరుతున్నాయి..
- వీటిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు, ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
- ‘‘ఓట్ జిహాద్’’కి పాల్పడుతున్నాయని బీజేపీ విమర్శలు..
Maharashtra Elections 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో మతం ఆధారంగా ఓట్లు అడిగేలా అనేక ముస్లిం సంస్థలు ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ శనివారం ఆరోపించింది. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టుని కోరింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యకర్త మౌలానా సజ్జాద్ నోమాని మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి బహిరంగంగా మద్దతు ప్రకటించారని ఆరోపించారు.
Read Also: Mystery Man: యూపీలో ‘‘మిస్టరీ మ్యాన్’’ అరెస్ట్.. నిద్రిస్తున్న మహిళ తలపై కొట్టి, దోపిడీలు..
Also Read
రాష్ట్రంలోని 269 స్థానాల్లో ఎంవీఏకు ఓటు వేయాలని, బీజేపీయేతర పార్టీలకు ఓటేయాలని నోమానీ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు, ఇలాంటి ప్రకటనలు ప్రజాస్వామ్య సూత్రాలకు ముప్పు అని భాటియా పేర్కొన్నారు. అంతకుముందు జార్ఖండ్లోని జమియత్ ఉలేమా ఇ హింద్ కూడా ఇలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమికి ఓటు వేయాలని ముస్లింలను కోరారు.
ఇలా పలు ముస్లిం సంస్థలు, నాయకులు ఒకే పార్టీకి ఓటేయాలని కోరడాన్ని బీజేపీ ‘‘ఓట్ జిహాద్’’గా పిలుస్తోంది. “దీన్నే ఓటు జిహాద్” అని భాటియా అన్నారు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే మరియు శరద్ పవార్లు “బుజ్జగింపు రాజకీయాలు” చేస్తున్నాయని, ప్రజాస్వామ్య సమగ్రత కంటే “అధికార వ్యామోహం”కు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇండియా కూటమి విధానంతో అక్రమ వలసలను ప్రోత్సహించడం, వారికి మద్దతు ఇవ్వడం వంటి ఉన్నాయని అన్నారు. ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని చెప్పారు. మతపరమైన ప్రాతిపదికన చేసిన అప్పీళ్లపై విచారణ జరిపి, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం మరియు సుప్రీం కోర్టును కోరింది, ఇటువంటి పద్ధతులు అవినీతి ఎన్నికల ప్రవర్తనగా పరిగణించబడుతున్నాయని పేర్కొంది.
తాజావార్తలు
-
Cheapest Saree Markets: మగువలకు గుడ్ న్యూస్.. రూ.150 కే పట్టు చీరలు.. దేశంలోనే అత్యంత చౌకైన మార్కెట్లు ఇవే!
-
Varanasi: మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో మెసేజ్.. ‘వారణాసి’ వరల్డ్ గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్!
-
Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
-
RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్నే మార్చేసింది!
-
Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!