Maharashtra Elections 2024: ముస్లిం సంస్థల ‘‘ఓట్ జిహాద్’’.. చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన బీజేపీ..
- ముస్లిం సంస్థలు కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ఓట్లు కోరుతున్నాయి..
- వీటిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు, ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
- ‘‘ఓట్ జిహాద్’’కి పాల్పడుతున్నాయని బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Elections 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో మతం ఆధారంగా ఓట్లు అడిగేలా అనేక ముస్లిం సంస్థలు ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ శనివారం ఆరోపించింది. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టుని కోరింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యకర్త మౌలానా సజ్జాద్ నోమాని మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి బహిరంగంగా మద్దతు ప్రకటించారని ఆరోపించారు.
Read Also: Mystery Man: యూపీలో ‘‘మిస్టరీ మ్యాన్’’ అరెస్ట్.. నిద్రిస్తున్న మహిళ తలపై కొట్టి, దోపిడీలు..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
రాష్ట్రంలోని 269 స్థానాల్లో ఎంవీఏకు ఓటు వేయాలని, బీజేపీయేతర పార్టీలకు ఓటేయాలని నోమానీ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు, ఇలాంటి ప్రకటనలు ప్రజాస్వామ్య సూత్రాలకు ముప్పు అని భాటియా పేర్కొన్నారు. అంతకుముందు జార్ఖండ్లోని జమియత్ ఉలేమా ఇ హింద్ కూడా ఇలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమికి ఓటు వేయాలని ముస్లింలను కోరారు.
ఇలా పలు ముస్లిం సంస్థలు, నాయకులు ఒకే పార్టీకి ఓటేయాలని కోరడాన్ని బీజేపీ ‘‘ఓట్ జిహాద్’’గా పిలుస్తోంది. “దీన్నే ఓటు జిహాద్” అని భాటియా అన్నారు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే మరియు శరద్ పవార్లు “బుజ్జగింపు రాజకీయాలు” చేస్తున్నాయని, ప్రజాస్వామ్య సమగ్రత కంటే “అధికార వ్యామోహం”కు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇండియా కూటమి విధానంతో అక్రమ వలసలను ప్రోత్సహించడం, వారికి మద్దతు ఇవ్వడం వంటి ఉన్నాయని అన్నారు. ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని చెప్పారు. మతపరమైన ప్రాతిపదికన చేసిన అప్పీళ్లపై విచారణ జరిపి, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం మరియు సుప్రీం కోర్టును కోరింది, ఇటువంటి పద్ధతులు అవినీతి ఎన్నికల ప్రవర్తనగా పరిగణించబడుతున్నాయని పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!