Earthquake Hits Rajasthan: దేశంలో వరసగా మరో రోజు భూకంపం సంభవించింది. రాజస్థాన్ లో రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ భూకంపం వచ్చింది. రాజస్థాన్ బికనీర్ నగరానికి వాయువ్య ప్రాంతంలో 236 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. భూమికి దాదాపుగా 10 కిలోమీటర్ల లోతులో
Earthquake Hits Philippines: ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉత్తర ఫిలిప్పీన్స్ ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. రాజధాని మనీలాకు 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం ధాటికి రాజధానిలోని ఎత్తైన భవనాలు కుదుపులకు లోనైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. బుధవారం ఉదయం 8.43 గంటలకు అబ్రా ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ తరచూ భూప్రకంపనలు భయపెడుతూనే ఉన్నాయి.. అయితే, అవి తీవ్రస్థాయి భూకంపాలు మాత్రం కావు.. తాజాగా, నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.. ఇవాళ ఉదయం జిల్లాలోని నాలుగు మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.. దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాలతో పాటు మర్రిపాడు మండలంలో భూ ప్రకంపనలు వచ్చాయి.. పలు గ్రామాలలో మూడు సెకన్ల నుంచి ఐదు సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.. భూ ప్రకంపనల కారణంలో ఇళ్లలోని వస్తువులు…
చైనాలో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఆదివారం మరోసారి భూకంపం వచ్చింది. జిన్ జియాంగ్ ఉయ్గర్ అటానమస్ రీజియన్ లో ఆదివారం 5.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని చైనా ఎర్త్క్వేక్ నెట్వర్క్ సెంటర్ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. అంతకుముందు రోజు శనివారం కూడా జిన్జియాంగ్ ప్రావిన్స్ లో రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. జూన్ నెలలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో 5.8 తీవ్రతతో భూకంపం…
ఇరాన్ శక్తివంతమైన భూకంపంతో వణికింది. శనివారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్లో రిక్టర్ స్కేల్ పై 6.0తో భూకంపం సంభవించింది. హెర్మోజ్ ప్రావిన్స్ లోని బందర్ అబ్బాస్ నగరానికి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదు అయింది. ఇప్పటి వరకు అందిన సమచారం ప్రకారం ఎనిమిది మందికి గాయాలు కాగా.. ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ భూకంపం వల్ల సరిహద్దు దేశాలైన…
కర్నాటకలో ఇవాళ (మంగళవారం) ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. భయంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే.. గత మూడు రోజుల్లో ఇలా ప్రకంపనాలు రావడం ఇది మూడోసారి కావడంతో ప్రజలు భయాందోనకు గురవుతున్నారు. కాగా. సుల్లియా పరిసర ప్రాంతాల్లో రెండోసారి ప్రకంపనలు రికార్డయ్యాయి. అయితే ప్రజలు మాట్లాడుతూ.. భారీ శబ్దంతో…
హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేసింది ఇండియన్ ఓషియన్ సునామీ వార్నింగ్ మెటిగేషన్ సిస్టమ్ (ఐఓఎస్ డబ్ల్యూఎంఎస్). ఇండోనేషియా సమీపంలోని తూర్పు తైమూర్ దేశంలో శుక్రవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం సునామీ ప్రమాదాన్ని తీసుకురావచ్చని అంచాన వేసింది. తూర్పు తైమూర్ ఇండోనిషియా మధ్య తైమూర్ ద్వీపం నుంచి 51.4 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇండోనేషియా దాని పరిసర దేశాలు ‘పసిఫిక్…
దక్షిణ అమెరికా దేశం పెరులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ పెరులోని అజాంగారో పట్టణానికి పశ్చిమ వాయువ్యంగా 8 మైళ్లదూరంలో భూకంప కేంద్రం ఉంది. లిటికాకా సరస్సుకు సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ ప్రాంతం పెరు- బొలీవియా దేశాల సరిహద్దుల్లో ఉంది. దాదాపుగా 217 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్ర ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. ఇదిలా ఉంటే…