Home
Earthquake
Earthquake News
-
ఇండోనేషియాలో సునామీ హెచ్చరిక జారీ
ఇండోనేషియాలోని ఫ్లోర్స్ సముద్ర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలోఈ భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన ఇండోనేషియా ప్రభుత్వం తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంవత్సరం ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం వాయువ్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని (GFZ) జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లో డిసెంబర్ 26, 2004న 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీకి దారి… -
తమిళనాడులో ఒకవైపు వర్షాలు.. మరోవైపు భూకంపం.. వణికిపోతున్న ప్రజలు
తమిళనాడులోని వెల్లూరులో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో పలుచోట్ల భూమి బీటలు వారడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.6గా తీవ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని వారు తెలిపారు. భూ అంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ అధికారులు పేర్కొన్నారు. అయితే భూకంపం వల్ల… -
విశాఖలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు
విశాఖ నగరంలో ఆదివారం తెల్లవారుజామున పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మధురానగర్, బీచ్ రోడ్డు, మురళీనగర్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, అల్లిపురం, తాటిచెట్లపాలెం, బంగారమ్మపేట, జ్ఞానాపురం, తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా సమాచారం తెలుసుకున్న అధికారులు భూప్రకంపనలకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. Read Also: నాలుగు రాష్ట్రాలలో… -
గుజరాత్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంతంటే?
ఒకవైపు దీపావళి పండుగ.. మరోవైపు పండుగ సందడి వేళ గుజరాత్ లోని ద్వారక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ మధ్య కాలంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా దీపావళి పండుగనాడు గురువారం గుజరాత్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ద్వారకకు ఉత్తర వాయువ్య దిశగా 223 కిలోమీటర్ల… -
మంచిర్యాలలో భూప్రకంపనలు..
మంచిర్యాల జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి.. జిల్లా కేంద్రంలో భూ ప్రకంపనలు సంభవించడంతో.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు… మంచిర్యాలోని చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతా రాంపూర్ తదితన ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూ కదలికలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. భూప్రకంపననల… -
పాక్లో భారీ భూకంపం… 15 మంది మృతి…
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో దాదాపుగా 15 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టాలో ఆ భూకంపం సంభవించింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6 గా నమోదైంది. భూకంపాలు సంభవించే జోన్లో… -
భూకంపం తరువాత కెరటాలు లేకుండా ఉప్పాడ సముద్రం… ఆందోళనలో మత్స్యకారులు…
సముద్రతీరంలో అలలు ఎలా విరుచుకుపడుతుంటాయో చెప్పక్కర్లేదు. మామూలు సమయాల్లో కూడా అలలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంటాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, విశాఖ జిల్లా భీమిలి, శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంతాల్లోని సముద్రపు అలలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంటాయి. అయితే, మంగళవారం రోజున రాజోలు నుంచి సముద్రంలోని 156 కిమీ దూరంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత 5.1 గా నమోదైన సంగతి తెలిసిందే. ఈ భూకంపం తరువాత సముద్రంలో సడెన్గా మార్పులు కనిపించాయి. ఎప్పుడు అలలతో… -
వికారాబాద్లో కలకలం.. 20 గ్రామాల్లో భూ ప్రకంపణలు..!
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపణలు కలకలం సృష్టిస్తున్నాయి… వికారాబాద్ జిల్లా తాండూరు – కర్ణాటక సరిహద్దుల్లోని సేడం చించోలి తాలూకాలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చిందని చెబుతున్నారు స్థానికులు… అర్ధరాత్రి భూప్రకంపణలు సంభవించడంతో… ఇంట్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు… రాత్రి అంతా ఇళ్లబయటే గడిపినట్టుగా తెలుస్తోంది.. సేడం, చించౌలి నియోజక పరిధిలోని.. దాదాపు 20 గ్రామాల్లో భూకంపం వచ్చింది… కేరెలి, బూతుపూర్, చింతకుంట, భూర్గుపల్లి, నుదిగొండ, అలచెర, వాజ్ర, కోండంపల్లి, బోక్తంపల్లి, రైగొడ సహా తదితర… -
అండమాన్ దీవుల్లో భూకంపం..రిక్టర్ స్కేల్పై 3.8 నమోదు
అండమాన్ దీవుల్లో గురువారం అర్థరాత్రి దాటిన అనంతరం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో రాత్రి 1.37 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. నికోబార్ దీవిలోని క్యాంప్ బెలే బే నుంచి 640 కి మీ దూరంలో.. భూమికి పది కిమీ లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎస్సీఎస్ పేర్కొంది. గురువారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. జమ్మూ కాశ్మీర్ లోని కత్రా, యూపీలోని… -
ఆఫ్ఘన్ నెత్తిన భూకంపం పిడుగు… పరుగులు తీసిన ప్రజలు…
అసలే తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మళ్లీ మద్యరాతి యుగంనాటి పరిస్థితులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న ప్రజలు తాలిబన్ల రాకతో ఉంటామా లేదా అని సందేహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నెత్తిన మరో ఉపద్రవం వచ్చిపడింది. ప్రకృతి కూడా వారికి సహకరించడం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.8గా నమోదైంది. ఫైజాబాద్కు 83 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.…
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!