Earthquake: జమ్మూ కాశ్మీర్ లో వరసగా తొమ్మిది భూకంపాలు.. పొంచి ఉన్న ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Back-To-Back Earthquakes Hits Jammu Kashmir: జమ్మూాకాశ్మీర్ లో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాలయ రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే ఇలా వరసగా భూకంపాలు రావడం ముందస్తు ప్రమాదాన్ని సూచిస్తోందని చెబుతున్నారు నిపుణులు. ఈ వారంలో వరసగా తొమ్మది భూకంపాల రావడం మాత్రం చాలా అరదనే చెప్పవచ్చు. ఈ వారంలో 4.1,3.2 తీవ్రతతో తొమ్మిది వరస భూకంపాలు వచ్చాయి. 60 గంటల్లోనే ఈ భూకంపాలు సంభవించాయి. దీంతో అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాజాగా బుధవారం రాత్రి 11.52 గంటల ప్రాంతంలో తొమ్మిదో భూకంప 3.1 తీవ్రతతో జమ్మూ కాశ్మీర్ డోదాలో సంభవించింది. మంగళవారం ఆరు భూకంపాలు జమ్మూ కాశ్మీర్ ప్రజలను కలవరపెట్టాయి. అంతకు ముందు బుధవారం రాత్రి 11.04 గంటలకు 4.1 తీవ్రతతో కాట్రాలో భూకంపం వచ్చింది. కత్రా, దోడా, ఉదంపూర్, కిష్ట్ వార్ జిల్లాల్లో భూప్రకంపనుల సంభవించాయి.
Read Also: Somanathan Committee Meet: విభజన సమస్యలపై సోమనాథన్ కమిటీ భేటీ
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
జమ్మూ కాశ్మీర్ ప్రాంతంల అత్యంత తీవ్రమైన భూకంప ప్రభావిత జోన్ లో ఉంది. హిమాలయ ప్రాంతంలో ఇటీవల కాలంలో టెక్టానిక్ ప్లేట్ల కదలిక చురుకుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రకంపనలు మరన్ని వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా పెద్ద భూకంపం సంభవించే అవకాశాన్ని చెప్పారు జమ్మూ యూనివర్సిటీ భూగర్భ శాస్త్రవేత్ జీఎం భట్. సాధారణంగా పెద్ద భూకంపానికి ముందు చిన్నచిన్నవి ఇలాగే సంభవిస్తాయని ఆయన వెల్లడించారు.
2013లో చివరిసారిగా 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అంతకుముందు 1962లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కార్యకలాపాలు ఈ ప్రాంతంలో నిరంతర ప్రక్రియ అని.. భట్ అన్నారు. మూడు రోజుల్లో వరసగా తొమ్మిది సంఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. అక్టోబర్ 2005లో 7.3 తీవ్రతతో భారత్, పాక్ సరిహద్దుల్లో వచ్చిన భూకంపంతో 73,000 మందికి పైగా మరనించారు. 1935 తర్వాత దక్షిణాసియాలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపంగా ఇది నిలిచిపోయింది.
తాజావార్తలు
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!