Earthquake: చైనా, అఫ్ఘానిస్తాన్ను అతలాకుతలం చేసిన భూకంపం.. భారీగా మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేల్పై 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు 21 మంది మరణించారని, చాలా మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా నివేదించింది. సిచువాన్ ప్రావిన్స్లోని లూడింగ్కు సుమారు 39 కిలోమీటర్ల పరిధిలో ఈ భూకంప కేంద్రం ఏర్పడింది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో12:52 గంటలకు (బీజింగ్ సమయం) లూడింగ్ కౌంటీని తాకిన భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడి ఇళ్లకు నష్టం వాటిల్లిందని, విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని చైనా మీడియా వెల్లడించింది. భూకంపం సంభవించిన ప్రాంతానికి సుమారు 226 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిచువాన్ ప్రావిన్సు రాజధాని చెంగ్డులోనూ భూమి కంపించింది. 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చైనా భూకంప నెట్వర్క్ కేంద్రం వెల్లడించింది. సిచువాన్ ప్రావిన్స్లోని ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ 30 మందిని భూకంప కేంద్రానికి పంపింది. మరో 530 మంది రెస్క్యూ సిబ్బందిని మరో ఏడు ప్రాంతాల నుండి భూకంప కేంద్రానికి పంపారు. లూడింగ్లోని మోక్సీ టౌన్లోని భూకంప కేంద్రం వద్ద టెలికమ్యూనికేషన్లు ప్రస్తుతం నిలిపివేయబడ్డాయి. లూడింగ్ సమీపంలోని యాన్ నగరంలో 4.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు సమాచారం.
యురేసిన్, టెక్టోనిక్ ప్లేట్లు కలిసే టిబెటన్ పీఠభూమి అంచున ఉన్న సిచువాన్ భూకంపాలకు గురవుతుంది. అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయి జూన్లో సంభవించిన రెండు భూకంపాల వల్ల కనీసం నలుగురు మరణించారు. ఏప్రిల్ 20, 2013 న, యాన్ నగరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది, దీని ఫలితంగా 196 మంది మరణించారు. అంతకుముందు, మే 12, 2008న, సిచువాన్ ప్రావిన్స్లో 7.9 భూకంపం సంభవించింది, దీని ఫలితంగా 69,000 మంది మరణించారు. ఇటీవలి చరిత్రలో అత్యంత విధ్వంసక భూకంపాలలో ఇది ఒకటి.
Also Read
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
- BRICS 2026: "ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం".. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
- Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్లైన్కు నష్టం!
PM Narendra Modi: బ్రిటీష్ పీఎం రేసులో గెలుపొందిన లిజ్ ట్రస్కు ప్రధాని మోడీ అభినందనలు
అఫ్ఘాన్లో భూకంపం: అఫ్ఘానిస్తాన్లోని పలు ప్రావిన్సులలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో కనీసం ఆరుగురు మరణించగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కునార్లోని నూర్గుల్ జిల్లాలో భారీ నష్టం జరిగినట్లు స్థానిక అధికారి వెల్లడించారు. ప్రావిన్స్లోని అనేక ప్రాంతాల్లో డజన్ల కొద్దీ నివాసాలు ధ్వంసమయ్యాయని టోలో న్యూస్ నివేదించింది.
భూకంప కేంద్రం తూర్పు నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్లో 10 కిలోమీటర్ల లోతులో ఉదయం 2.27గంటలకు సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాబూల్, నంగర్హర్, లఘ్మాన్, కునార్, నూరిస్తాన్, డ్యూరాండ్ రేఖకు అవతలి వైపున ఉన్న కొన్ని ప్రాంతాలలో భూకంపం సంభవించినట్లు ప్రారంభ నివేదికలు తెలిపాయి. పాకిస్థాన్లో డాన్ పత్రిక ప్రకారం, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, మర్దాన్, అబోటాబాద్, స్వాబీ, మొహమ్మంద్, బజోర్, బునెర్ మరియు పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అయితే, పాకిస్థాన్లో జరిగిన నష్టం లేదా ప్రాణనష్టం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!