Asia Cup 2022: నేటి నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టోర్నీ ప్రారంభం కానుంది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా అక్కడి ఆర్ధిక పరిస్థితుల కారణంగా యూఏఈకి షిఫ్ట్ చేశారు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. దీంతో అన్ని జట్లు టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఈ టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొత్తం ఆరు జట్లు.. 13 మ్యాచ్లు.. 16 రోజుల పాటు జరగనున్నాయి.…
Irfan Pathan: విస్తారా ఎయిర్లైన్స్పై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ముంబై నుంచి దుబాయ్ వెళ్తుండగా విస్తారా సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని ఇర్ఫాన్ పఠాన్ ఆరోపించాడు. ముంబై నుంచి దుబాయ్ వెళ్లేందుకు విస్తారా విమానం యూకే-201లో టిక్కెట్ బుక్ చేసుకున్నానని.. కానీ చెక్ ఇన్ కౌంటర్ వద్ద తనకు చేదు అనుభవం ఎదురైందని పఠాన్ వివరించాడు. తన భార్య, పిల్లలతో దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నానని..…
బతుకుదెరువు కోసం దుబాయ్ బాట పట్టాడు.. 15 ఏళ్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో పనిచేస్తున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది.. ఆన్లైన్ లాటరీలో 10 కోట్ల రూపాయల బంపర్ బహుమతిని తగిలింది.. మొత్తానికి కేరళకు చెందిన వ్యక్తిని అదృష్టం రాత్రికి రాత్రే ధనవంతుడిని చేసింది.. కేరళ రాజధాని తిరువనంతపురంకు చెందిన షానవాజ్.. బతుకుదెరువు కోసం.. గత 15 ఏళ్లుగా యూఏఈలో పనిచేస్తున్నారు. గత ఏడాదిన్నరగా ఆన్లైన్ లాటరీలో పాల్గొంటూ వస్తున్నాడు.. తాజాగా దుబాయ్లో జరిగిన ఆన్లైన్…
ఇటీవల కాలంలో తరుచుగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో ఇండియాలో రెండుసార్లు స్పైస్ జెట్ విమానాలు టెక్నికల్ సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే తాాజాగా దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా బ్రిస్బేన్ కు వెళ్తున్న ఎయిర్ బస్ ఏ3780 విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. జూలై 1న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఎమిరేట్స్ ఎయిర్ బస్ విమానం బ్రిస్బేన్ కు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ఎడమ రెక్కకు…
నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు దడ పుట్టిస్తున్నారు. అన్న వస్త్రాల కోసం ఉన్న వస్త్రాలు పోయాయయనేది సామెత. ఈ విషయంలో అది నిజమయింది. దుబాయ్ దినార్స్ పేరిట అమాయకులకు వల వేస్తున్నారు. దుబాయ్ కరెన్సీ లక్ష ఇస్తే..ఇండియా కరెన్సీ ఇవ్వండంటూ నమ్మించి నట్టేట మంచుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొందరు కేటు గాళ్లు నయాదందాకు తెరలేపారు. బోధన్, బాన్సువాడ కేంద్రంగా.. ఈ ముఠా అమాయకులను కరెన్సీ పేరిట మోసాలకు గురిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. బోధన్,…
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్టైనర్తో తన అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, “సర్కారు వారి పాట” మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి ఆదరణ లభించగా, సినిమాను వెండితెరపై వీక్షించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు సూపర్…
టాలీవుడ్ స్టార్ హీరో డా. రాజశేఖర్, జీవిత ల ముద్దుల కూతుళ్లు శివాని, శివాత్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు తల్లిదండ్రుల బాటలోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి విజయాలను అందుకుంటూ స్టార్లు గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక దొరసాని తో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక ఇటీవల దుబాయ్ లో హల్చల్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఎప్పుడు ఫ్యామిలీతో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా దుబాయ్ లో ఒక్కత్తే ఫోటోలకు పోజులు…