YS Jagan: ప్రజల తరఫున అనేక పోరాటాలు చేశాం.. గుండె ధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్!
- కార్యకర్తలు, నాయకులతో వైఎస్ జగన్ సమావేశం
- ప్రజల తరఫున అనేక పోరాటాలు చేశాం
- గుండె ధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒంగోలు నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని, వాటిలో భాగంగానే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఒక్కరిది కాదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నిర్మించిన పార్టీ అని జగన్ పేర్కొన్నారు. పార్టీ విలువలు, విశ్వసనీయత మీదే పుట్టిందని.. అదే పునాదులపై ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
గత 16 సంవత్సరాల్లో ప్రజల తరఫున అనేక పోరాటాలు చేశామని, గుండెధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్ అని వైఎస్ జగన్ చెప్పారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను తుచా తప్పకుండా అమలు చేశామని తెలిపారు. మేనిఫెస్టోను కచ్చితంగా పాటిస్తూ ముందుగానే క్యాలెండర్ ప్రకటించి పథకాలను అమలు చేసినట్టు గుర్తు చేశారు. ఆర్థిక ఒత్తిళ్లు, కోవిడ్ వంటి సంక్షోభాల మధ్య కూడా పేదలు, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచామన్నారు. వైసీపీ హయాంలో తీసుకున్న అప్పుల్లో పెద్ద భాగాన్ని నేరుగా ప్రజల ఖాతాల్లోకి పంపించామని పేర్కొన్నారు.
Also Read
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
Also Read: YS Jagan: పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. సీఎం నో యాక్షన్!
ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ.. సీఎంచంద్రబాబు హామీలను నిలబెట్టుకోలేకపోయారని వైఎస్ జగన్ ఆరోపించారు. రెండేళ్లలోనే భారీ అప్పులు చేసినప్పటికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని వినియోగించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ పథకాలను రద్దు చేసి ప్రజలను నిరాశపరిచారని అన్నారు. అమరావతి అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదని, దోపిడీ పెరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిందని విమర్శించారు. ఈ సందర్భంగా చుండూరు రవికి తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజలతో మరింత దగ్గరగా ఉండి, వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని జగన్ సూచించారు.
తాజావార్తలు
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!