Asia Cup 2022: నేటి నుంచే ఆసియాకప్.. టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఆరు జట్ల అమీతుమీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2022: నేటి నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టోర్నీ ప్రారంభం కానుంది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా అక్కడి ఆర్ధిక పరిస్థితుల కారణంగా యూఏఈకి షిఫ్ట్ చేశారు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. దీంతో అన్ని జట్లు టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఈ టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొత్తం ఆరు జట్లు.. 13 మ్యాచ్లు.. 16 రోజుల పాటు జరగనున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి.
Read Also: ఇండియాలో 10 అంతుపట్టని ప్రదేశాలు..
Also Read
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
- India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
- ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్లో శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆదివారం నాడు టోర్నీలోనే హైఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో రికార్డు స్థాయిలో ఆసియా కప్ను టీమిండియా ఏడు సార్లు గెలుచుకుంది. గత రెండు సార్లు జరిగిన ఆసియా కప్ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో అందరి దృష్టి పేలవ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీపైనే ఉంది. ఆసియా కప్తో కోహ్లీ ఫామ్లోకి రావాలని అతడి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
టోర్నీ ఫార్మాట్ ఇదే..
గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, హాంకాంగ్, గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ఉన్నాయి. తమ గ్రూప్లోని 2 జట్లతో ఆడిన అనంతరం టాప్2 టీమ్లు ముందంజ వేస్తాయి. అక్కడ మూడు టీమ్లతో పోటీ పడాలి. ఇందులో టాప్-2 జట్లు ఫైనల్కు చేరతాయి. దుబాయ్, షార్జాలలోనే అన్ని మ్యాచ్లు జరుగుతాయి. సెప్టెంబర్ 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!