Asia Cup 2022: నేటి నుంచే ఆసియాకప్.. టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఆరు జట్ల అమీతుమీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2022: నేటి నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టోర్నీ ప్రారంభం కానుంది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా అక్కడి ఆర్ధిక పరిస్థితుల కారణంగా యూఏఈకి షిఫ్ట్ చేశారు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. దీంతో అన్ని జట్లు టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా ఈ టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొత్తం ఆరు జట్లు.. 13 మ్యాచ్లు.. 16 రోజుల పాటు జరగనున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి.
Read Also: ఇండియాలో 10 అంతుపట్టని ప్రదేశాలు..
Also Read
- Rohit Sharma: హిట్మ్యాన్ రిటైర్మెంట్పై జోరుగా చర్చ.. టీమిండియా కోచ్ కీలక ప్రకటన
- India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
- England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్...! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్లో శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆదివారం నాడు టోర్నీలోనే హైఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో రికార్డు స్థాయిలో ఆసియా కప్ను టీమిండియా ఏడు సార్లు గెలుచుకుంది. గత రెండు సార్లు జరిగిన ఆసియా కప్ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో అందరి దృష్టి పేలవ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీపైనే ఉంది. ఆసియా కప్తో కోహ్లీ ఫామ్లోకి రావాలని అతడి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
టోర్నీ ఫార్మాట్ ఇదే..
గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, హాంకాంగ్, గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ఉన్నాయి. తమ గ్రూప్లోని 2 జట్లతో ఆడిన అనంతరం టాప్2 టీమ్లు ముందంజ వేస్తాయి. అక్కడ మూడు టీమ్లతో పోటీ పడాలి. ఇందులో టాప్-2 జట్లు ఫైనల్కు చేరతాయి. దుబాయ్, షార్జాలలోనే అన్ని మ్యాచ్లు జరుగుతాయి. సెప్టెంబర్ 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!